క్రైమ్/లీగల్

రెండు ప్రాణాలు బలిగొన్న అనుమానం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, జూన్ 1:కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్నకొడుకును దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం డోన్ మండల పరిధిలోని అనుంపల్లె గ్రామంలో సంచలనం రేపింది. వివరాలు.. అనుంపల్లె గ్రామానికి చెందిన జక్కా నరేష్(28) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తన కుమారుడైన 9 సంవత్సరాల గణేష్ తనకు పుట్టలేదనే అనుమానంతో శుక్రవారం పురుగుల మందు తాపించి హత్య చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ కూడా గ్రామ సమీపంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మీదేవిపై అనుమానంతో నరేష్ గత కొంతకాలంగా ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. చివరకు వారికి కల్గిన సంతానంపై కూడా అనుమానం పెంచుకున్న గణేష్ కన్న కొడుకుకు బలవంతంగా పురుగుల మందు తాపించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య లక్ష్మీదేవి శుక్రవారం డోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నరేష్ తీవ్ర మనస్థాపానికి గురై చెట్టుకు ఉరేసుకున్నాడు కట్టుకున్న భర్త, కన్నకొడుకు మృతదేహాలపై పడి లక్ష్మీదేవి పెట్టే రోదనలు పలువురిని కలిచివేశాయి. అనుమానమే ఇద్దరి ప్రాణాలను బలిగొందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాజగోపాల్‌నాయుడు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపారు.