చిత్తూరు

తండ్రిని మించిన తనయుడు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తండ్రిని మించిన తనయుడని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలని వైకాపా యువ నాయకుడు అభినయ్ రెడ్డి కొనియాడారు. గడగడప గడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా ఆదివారం 5వ వార్డయిన కొర్లగుంట మారుతీనగర్‌లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను అమలు చేస్తారని చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే తిరుపతి ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిని అత్యిధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు వేమూరి జ్యోతిప్రకాష్, నరసింహులు, రామకృష్ణారెడ్డి, రాజారెడ్డి, అనిల్, శాంతారెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, టి.రాజేంద్ర, గోపాల్ రెడ్డి, బొగ్గుల వెంకటేస్, కృష్ణచైతన్య యాదవ్, బాలిశెట్టి కిషోర్, గణేష్, పాముల రమేష్ రెడ్డి,తాళ్లూరి ప్రసాద్, పులికంటి గోపీనాథ్ రెడ్డి, వంశీ, రామూర్తి రాయల్, పవన్‌రాయల్, సోమశేఖర్, చంద్ర, ఉదయ్ వంశీ, అశోక్‌రాజు, వంశీకృష్ణ, సద్దా బాలకృష్ణ యాదవ్, ప్రదీప్, దినేశ్‌వర్మ, సలీమ్, రాజేశ్, ప్రవీణ్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మకపల్లిలో పట్టపగలే దొంగల హల్‌చల్
* దొంగల బృందంలో మహిళను పట్టుకుని చితకబాదిన గ్రామస్థులు
పెద్దతిప్ప సముద్రం, మే 20: మండలంలోని బొమ్మకపల్లిలో ఆదివారం పట్టపగలే దొంగలు హల్‌చల్ చేసిన సంఘటన జరిగింది. ఐదుమంది దొంగలు ఓ ఇంట్లో చొరబడిన సమయంలో ఇంటిలోని మహిళ కేకలు వేయడంతో దొంగలు పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు వారి వెంటపడ్డారు. ఈక్రమంలో ఐదుమంది ఉన్న దొంగల బృందంలో ఓ మహిళను గ్రామస్థులు పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకువచ్చారు. ఈసందర్భంగా గ్రామస్థులు ఆడ, మగ కలిసి చితకబాదారు. మరి కొంత మంది గ్రామస్థులు బృందాలుగా విడిపోయి పారిపోయిన దొంగల కోసం గాలిస్తున్నారు. నలుగురు పురుషులు, ఒక మహిళ దొంగల బృందంలో ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ బృందంలోని మహిళ పట్టుబడినట్లు తెలుసుకుని గ్రామస్థులు రచ్చబండ వద్దకు చేరుకున్నారు. పట్టుబడ్డ మహిళను గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.