చిత్తూరు

నేడు తిరుపతిలో సీఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరోజు పర్యటన నిమిత్తం శనివారం తిరుపతికి రానున్నారు. ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన కపిలతీర్థం వద్ద ఉన్న నగరవనం వద్దకు చేరుకుంటారు. 10.15 నుంచి 10.45 గంటల మధ్య నగరవనంలో మొక్కలు నాటుతారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఎన్‌జీఓ కాలనీకి చేరుకుని డిజిటల్ డోర్ నెంబర్ల పనితీరును పరిశీలిస్తారు. అక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరి స్థానిక నెహ్రూమున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 11.15 నుంచి 12.15 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12.15 గంటలకు బహిరంగ సభ వద్ద నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం సీఎం పర్యటించనున్న పాంతాలను జేసీ గిరీషా, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు ఇతర విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎక్కడా లోపాలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.