చిత్తూరు

పెరటాసి నెల శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: పవిత్రమైన పెరటాసి మాసంలో పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు శని, ఆదివారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. ఆ రోజుల్లో సిఫార్సు ఉత్తరాలను స్వీకరించడం జరగదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈనెల 22,23,29,30, అక్టోబర్ 6,7,13,14,20,21 తేదీల్లో విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని టీటీడీ తెలియజేసింది.

అన్నప్రసాదంకు రూ. 20 లక్షలు విరాళం
తిరుపతి, సెప్టెంబర్ 21: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ. 20లక్షలలు విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లింగ కుటుంబ సభ్యులు ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.