క్రైమ్/లీగల్

భార్యాభర్తల్లా చలామణి అవుతూ నేరాలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 21: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల నుంచి గత కొంతకాలంగా బంగారు ఆభరణాలు చోరీచేస్తూ భార్యాభర్తల్లా చలామణి అవుతున్న తమిళనాడు తిరుచ్చికి చెందిన మణికంఠన్, నందినిని తిరుమల క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 9లక్షలు విలువచేసే 300 గ్రాముల బరువుకలిగిన బంగారు చైన్‌లను తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణికంఠన్, నందిని పాతనేరస్తులని, వీరు తిరుమలలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భక్తుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు చోరీచేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీరిపై నిఘా ఉంచిన తిరుమల క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండుకు పంపారు.

ఓటేరు వద్ద కడపవాసి ఆత్మహత్య
తిరుపతి, నవంబర్ 21: ఓటేరు సమీపంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన శంకర్ (28) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు శవాన్ని పరీక్ష నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆ యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరావాల్సి ఉంది.