చిత్తూరు

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికిన వారిలో మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేసీ గిరీషా, సబ్‌కలెక్టర్ మహేష్‌కుమార్, కమిషనర్ విజయరామరాజు, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్, డీఐజీ కాంతిరాణాటాటా, ఇంటిలిజెన్స్ ఎస్పీ మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో వీఐపీ గేటు వద్ద ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్, శాప్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యేలు మోహన్, శ్రీనాధ్‌రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుణశేఖర్ నాయుడు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రజల వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి రోడ్డు మార్గాన నారావారి పల్లికి బయలుదేరి వెళ్లారు.