చిత్తూరు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని తేరువీధిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, పార్టీ నాయకులు దశరథాచారి, రమేష్, వర్మ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.