హైదరాబాద్

మరో దారుణం మరిదితో కలిసి భర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఫిబ్రవరి 8: అక్రమ సంబందానికి అడ్డువస్తున్నడనే అక్కసుతో కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. బిహార్ నుంచి వచ్చిన మరిదితో కలిసి హత్య చేసి అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించింది. మొదట అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను డీసీపీ సాయిశేఖర్ వెల్లడించారు. బిహార్‌కు చెందిన మంగళ్‌దాస్ జీవనోపాధికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి ఫత్తేనగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పిల్లలని అత్తారింటి వద్దే వదిలేసేందుకు బిహార్‌కు భార్య మాలతీదేవి వెళ్లింది. అక్కడ మరిది నీరజ్ కుమార్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త మంగళ్‌దాస్.. బిహార్‌కు వెళ్లి భార్యతో గొడవపడి నగరానికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో గత నెల 31న పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన మంగళ్‌దాస్ నిద్రిస్తున్న సమయంలో బిహార్ నుంచి వచ్చిన మరిది నీరజ్‌తో కలిసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్యలో భార్య హస్తం ఉన్నట్టు నిర్థారించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ గోవర్దన్, ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఉదయం మంచు, మధ్యాహ్నం మంట