డైలీ సీరియల్

చిన్మయుని చిత్రములేనా! ( చిత్రకేతువు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు వాడ రాజ్యం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. రాజుగారు నాకు లేక లేక పుట్టిన కొడుకు అందులోను మహర్షి వరం చేత పుట్టిన కొడుకు ఇలా ఎందుకు మృత్యువు పాలయ్యాడో అని వగచారు. కృతద్యుతి సవతులంతా బాధను నటించారు. చివరకు రాజు అంగీరస మహాముని వద్దకు బిడ్డను తీసుకుని వెళ్లి బతికించమని కోరుకుంటాను అనుకొన్నాడు.
ఆ దారిన పోతున్న నారదుడు ఆ రాజ్యంలోని ఏడుపులు విని ఏమై ఉంటుందో తెలుసుకుని అంగీరసుని చెంతకు వెళ్లి విఃయాన్ని వివరించారు. అంగీరసుడు కూడా నారదునితోకలసి వెక్కి వెక్కి ఏడుస్తున్న మహారాజు చెంతకు వచ్చాడు. ఏమి జరిగి ఉంటుందో ఆయన తన దివ్యదృష్టితో చూసి తెలుసుకొన్నాడు. మనుష్యుల్లో ఈర్ష్యాద్వేషాలు ఎంతటి పనికైనా తెగిస్తాయని అనుకున్నారు.
దాంతో రాజుగారికే జ్ఞానోదయం కలిగించాలని అంగీరస, నారదులు అనుకొన్నారు.
చనిపోయిన పిల్లవాని కాళ్ల దగ్గర కూర్చుని ఏడుస్తున్న రాజు రాణిని చూసి అంగీరసుడు వారి దగ్గరకు వచ్చాడు. మహారాజు మహర్షిని చూసి మరింతా బోరుమన్నాడు. ఆయన వారిని ఓదారుస్తూ ‘నిన్నమొన్నటి దాకా ఈ పిల్లవాని గురించి మీకు తెలయనే తెలియదు కదా. మీ దగ్గర కు వచ్చి కొన్ని నెలలు అయితే నే మీరు ఇంతగా రోదిస్తున్నారెందుకు? మనందరమూ కూడా ఒకనాటికి మృత్యువు పాలయ్యేవారిమే ఈ పిల్లవాడు ముందుగా వెళ్లాడు అంతే మీ రోదనలను ఆపండి అని చెప్పాడు.
ఆ మాటలకుతల్లి హృదయం దెబ్బతింది. కృతద్యుతి మరింతగా ఏడ్వనారంభించింది. దానితో మహారాజుకూడా ఆమె ఓదార్చలేక ఆయన కన్నీళ్లప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు.
చిత్రకేతువుదుఃఖాన్ని పూడ్చలేకపోయేసరికి అంగీరసుడు ‘మహారాజా! బాగానే ఏడుస్తున్నావు. కానీ ఇతడు నీకు ఏవౌతాడు? ’ ఆ విషయం నాకు చెప్పు అన్నాడు.
ఈ మాటలు వినేసరికి దుఃఖంలో కోపం వచ్చింది. ‘మహానుభావా! నేను అసలే దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. అది మీకు తెలిసి కూడా నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నారు’ అని అడిగాడు.
‘నాకు తెలుసుకనుక నేను మాట్లాడుతున్నాను. ఈ బిడ్డను నేను కదా ఇచ్చాను. తిరిగి ఈ బిడ్డను బతికించడం నాకు కష్టం కాదు. కానీ నీకు ఈ బిడ్డకు ఉన్న సంబంధం ఏమిటో నాకు చెప్పు’అన్నాడు.
ఈ మాటలతో మరింత కోపం హెచ్చి ‘స్వామీ ఇతడు నాకుమారుడు. ఇతడిని విడిచి నేను ఉండలేను. ఇతడే నా వంశాన్ని వృద్ధి చేస్తాడని ఎంతో ఎదురుచూస్తున్నాను. ఇపుడు వీడు ప్రాణాలు కోల్పోవడం నాకు జీర్ణం కావడంలేదు.
మీరు నా బిడ్డను బతికించగలిగి ఉండికూడా మీరు కాలయాపన చేయడం నాకు మీ భావమేమిటో అర్థం కావడంలేదు. మీరు దయచేసి నా బిడ్డను బతికించండి’ అని కన్నీళ్లు కారిపోతుండగా అడిగాడు. కృతద్యుతి కూడా ‘గురువర్యా! మీరిచ్చిన బిడ్డను మేము ఈనాడు పోగొట్టుకొన్నాము. దయచేసి మాకు మాబిడ్డను మాకిచ్చి మాప్రాణాలనునిలపండి’అని అడిగింది.
మరునిముషంలో అంగీరసుడు కళ్లు మూసుకుని కాసేపు ధ్యానం చేసి తన చేతిలో ఉన్న కమండలంలోని నీటిని చనిపోయిన పిల్లవానిపైన చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804