డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ‘తనువు’ ఆ ఋషుల మధ్య కూర్చుని ధర్మార్థాలతో కూడిన కదను చెప్పసాగాడు. అతను కదలు అలా చెప్తూ ఉండగా ఒక రాజు తన సైన్యంతో అంతఃపుర స్తల్రతో సహా అక్కడికి వచ్చాడు. అతనే భూరిద్యుమ్నుని తండ్రి. అతని పేరు వీరద్యుమ్నుడు. అతను అరణ్యంలో తన పుత్రుని కోల్పోయి చాలా దుఃఖంతో ఉన్నాడు. అతను ఆ కుమారుని కోసం ఆ వనంలో తిరుగసాగాడు. ‘పరమధార్మికుడు, ఒక్కడే కొడుకు ఇక అతనిని చూడడం నాకు దుర్లభం’ అని రాజు చింతించసాగాడు. అయినా అతనికి ఇంకా ఆశ పోలేదు. ఆ ఆశ అతని శరీరమంతా నిండి ఉంది. అప్పుడు ఆ మునులలో ఉత్తముడు అయిన తను మహర్షి ధ్యానంలో కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయాడు. అతను అలా ధ్యానించడం చూసి రాజు మెల్లగా ఇలా అన్నాడు.
‘దేవర్షీ! అన్నింటిలోకి దుర్లభమైనదేది? ఆశకంటే గొప్పది ఏది? నాకు దాచకుండా సత్యం చెప్పండి’.
అతని మాటలకు ముని ఇలా అన్నాడు. ‘‘రాజా! నీ పుత్రుని పూర్వం ఒక ముని తనకు బంగారు కలశాన్ని వల్కలాలను అడిగితే బుద్ధితక్కువగా ఆ మునిని నీ కుమారుడు వాటిని ఇవ్వకపోగా అవమానించి పంపాడు. దానితో ఆ ముని చాలా బాధపడ్డాడు. దాని ఫలితమే ఇది’’.
ముని అలా చెప్పగానే రాజు కూలబడిపోయాడు. మునులు తపోవన మర్యాదను పాటించి రాజుకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. తరువాత వారందరూ కూర్చుని తపోవనానికి రాజు రాకకు కారణం అడిగారు.
అప్పుడు రాజు వారితో ఇలా చెప్పాడు. ‘‘నేను వీరద్యుమ్నుడనే రాజును. నా కుమారుని కోసం వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నాకు అతను ఒక్కడే పుత్రుడు. చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇలా వెతుకుతూ తిరుగుతున్నాను’’.
రాజు ఇలా చెప్పగానే ముని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అతను రాజుతో ఏమీ అనలేదు. పూర్వం ఒక సారి ఈ రాజే ఆ ఋషిని గౌరవించలేదు. అప్పుడు ఋషి ‘రాజుల నుండి ఏమీ గ్రహించకూడదు’ అని నిశ్చయించుకున్నాడు. ఎవరి నుండీ ఏమీ తీసుకోను అని కూడా తలచాడు. ‘ఆశయే మూర్ఖుడైన వానిని నడిపిస్తుంది. దానిని తొలగిస్తాను’ అని అనుకున్నాడు. రాజు మరల మునిని ప్రశ్నించాడు. ‘ఈ భూమి మీద దుర్లభమైనదేది? ఆశ కంటే దుర్బలమైనది ఏది? దయచేసి ఈ తత్త్వాన్ని నాకు తెలియజేయండి’’.
రాజు మాటలు విన్న ఋషి ఇలా అన్నాడు ‘రాజా! ఆశను మించిన బలహీనత ఇంకొకటి లేదు. ఆ బలహీనత వల్లనే నేను రాజులను యాచించాను’’.
రాజు మరల అడిగాడు. ‘‘మహాత్మా! ఆశవలన దుర్బలత్వం కలుగుతుందని తెలిసింది. అలాగే ఆశించిన వస్తువు దుర్లభమని కూడా అర్థమైంది. ఇంకొక్కటి అడుగుతాను. దయచేసి వివరించండి. మీకంటే మించిన బలహీనమైనది ఏది?’’
మిక్కిలి కృశించి యున్న ‘తను’ మహర్షి రాజు ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘ఎవరినైనా అవసరపడి యాచించినవాడు దుర్బలుడు. అలాంటి యాచకుని అవమానించినవాడు దుర్బలతరుడు. ఎవరినైనా వచ్చి యాచిస్తే యథోచితంగా తన శక్తిని అనుసరించి ఉపకారం చేయకపోతే అప్పుడు సమస్త ప్రాణులకు ఉండే ఆశ నా కంటే దుర్బలతరంగా ఉంటుంది. సోమరులు, కృతఘు్నలు, కౄరులు - వీరిలో ఉండే ఆశ తీరదు కనక చింత వలన దుర్బలం అవుతుంది. నాకంటే కూడా దుర్బలంగా ఉంటుంది. అలాగే ఒక్క కొడుకు ఉండి అతను లేకపోతే మనసులో కలిగే ఆశ కూడా అతి దుర్బలమైనది. వృద్ధవనితలకు పుత్రుడు కావాలనే ఆశ, ధనవంతులకు మరింత ధనం సంపాదించాలనే ఆశ, ఇవన్నీ నాకంటే కూడా దుర్బలమైనవి’’.
రాజు ముని మాటలు విని, తన స్తల్రతో కలిసి అతని పాదాలను శిరస్సుతో తాకి నమస్కరించాడు. మునితో ఇలా అన్నాడు ‘‘మహాత్మా! నన్ను అనుగ్రహించండి. నా కొడుకును చూడాలని కోరికగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినదంతా సత్యమే’’. రాజు అలా ప్రార్థించగా అతనిపై దయతలచి తను మహర్షి తన తపశ్శక్తితో ఆ రాజకుమారుని తండ్రి ముందు నిలబెట్టాడు. తర్వాత ముని రాజును తన ధర్మస్వరూపాన్ని చూపాడు. రాజు ఆ దివ్యరూపాన్ని చూసి పరవశించి పోయాడు. తర్వాత మహర్షి అరణ్యంలోకి వెళ్లిపోయాడు’’. ఋషభమహర్షి ఇదంతా చెప్పి ఇలా అన్నాడు ‘‘నేను ముని చెప్పినవన్నీ స్వయంగా విన్నాను. కనుక శరీరాన్ని బాగా కృశింపజేసేది ఆశ కనుక ఆ లేడి గురించి ఆశ తొలగించుకో’’ ఋషభముని మాటలు విన్న సుమిత్రుడు మృగం గురించిన ఆశ వదలుకొని తన నగరానికి వెళ్లిపోయాడు.
జాపకోపాఖ్యానము
పూర్వమొ హిమాలయ పర్వతాల సమీపంక్ష్మిఊ మహాయశస్వి, ధర్మవర్తనుడు అ్ఠన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను పిప్పలాదుని పుత్రుడు. అతను గొప్ప జాపకుడు, ప్రాజ్ఞుడు, వేదపండితుడు. ఆయన ఆరు వేదాంగాలక్ష్మిఊ కూడా నిష్ణాతుడు. అతను వేదాన్ని అధ్యయనం చేస్తూ జపం చేయసాగాడు. అలా వ్ఠొ సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి సావిత్రీ దేవి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. కాని అతను మాట్లాడక జపం చేస్తూనే ఉన్నాడు. సావిత్రిని పట్టించుకోలేదు. గాయత్రికి అతనిపై దయ కలిగింది. అతని జపంతో సంతృప్తి చెందింది. బ్రాహ్మణుడు తన జపం ముగించుకొని ఆమె పాదాలపై తలపెట్టి ఇలా అన్నాడు ‘‘దేవీ! నా భాగ్యం వలన నాకు దర్శనమిచ్చావు. నీవు నా జపంతో సంతృప్తి చెందితే నాకు జపంపై మనస్సు నిలిచేటట్లు అనుగ్రహించు’’
సావిత్రి ఇలా అంది - ‘‘బ్రహ్మర్షీ నీకేం కావాలి? నీకు ఇష్టమైనది ఏమిటి?’’ చెప్పు నేను అనుగ్రహిస్తాను.
అప్పుడు ఆ ద్విజుడు మళ్ళీ ఇలా అన్నాడు - ‘‘తల్లీ! నాకు జపం మీద మనసు నిలిచేటట్లు చ్ఠొ. జపం అంటే నాకు ఆసక్తి ఉండాలి. నా మనస్సమాధి వర్థిల్లేటట్లు అనుగ్రహించు’’
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి