ధనం మూలం

ఆలోచన తోడైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సినిమాలో మధ్యవయసులో ఉన్న హాస్యనటుడు బ్రహ్మానందాన్ని మీరేం చేస్తుంటారు? అని ప్రశ్నిస్తే- కలం స్నేహం, సినిమాలు చూడడం. అంటూ వరుసగా తన హాబీలు చెబుతుంటాడు. అలానే చాలా మంది ఇంట్లో టీవీ సీరియల్స్ చూడడం, మగాళ్లయితే క్రికెట్, మందు పార్టీలు, కాలక్షేపం కబుర్లతో జీవితం గడుపుతుంటారు. ఆఫీసుల్లో పని కన్నా కబుర్లు ఎక్కువ కొందరికి. గంటల తరబడి రాజకీయ చర్చలు కొందరికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.
హాబీలేమీ తప్పు కాదు. జీవితం అన్నాక యంత్రంలా ఉండలేం. ఏవో అభిరుచులు ఉంటాయి. టీవీ చూడడం, సినిమాలు చూడడం, రాజకీయాలు, సినిమాలపై చర్చలు తప్పేమీ కాదు. ఇవేవీ లేకుండా కేవలం సంపాదన కోసమే బతికితే జీవితం నిస్సారంగా మారుతుంది. అయితే జీవితంలో దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? దేనికి ఎంత సమయం కేటాయించాలి? అనే జ్ఞానం వీటన్నిటి కన్నా ముఖ్యం. రోజంతా టీవీలో సీరియల్స్ చూస్తూ గడపడం వేరు. సీరియల్స్ చూసి మనం ఎందుకు రాయలేం? అని రాయడం, దాని ద్వారా పేరుతో పాటు డబ్బు సంపాదించడం వేరు.
మన అలవాట్లు, మన ఆలోచనలు, మన నిర్ణయాలే మనం.. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో మనం అలానే మారుతాం.
ఆఫీసు నుంచి ఇంటికి రాగానే టీవీలో సినిమాలు, సీరియల్స్‌తో జీవితం గడిపే వారి జీవితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కానీ చివరకు ఆఫీసుకు వెళ్లే సమయం, ఆఫీసు నుంచి వచ్చే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే ఒక సామాన్య ఉద్యోగి కూడా వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడు అవుతాడు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమాని అవుతాడు. ఇదేమీ సినిమా కథ కాదు. మన కళ్ల ముందు జరిగిన కథ. ప్రతి ఒక్కరూ ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వేల కోట్ల రూపాయలకు అధిపతి అవుతారని కాదు. కానీ కచ్చితంగా ఉన్న స్థితి కన్నా ఎంతో కొంత మెరుగు పడడం ఖాయం.
కర్సన్ బాయ్ పటేల్ ఒక సాధారణ ఉద్యోగి. గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థలో కెమిస్ట్. తన ఇంటి నుంచి ఆఫీసు పదిహేను కిలో మీటర్ల దూరం. ఈ పదిహేను కిలోమీటర్లు సైకిల్‌పైనే ఆఫీసుకు వెళ్లే వారు. తిరిగి అదే సైకిల్‌పై ఇంటికి వచ్చేవారు. సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లే సాధారణ ఉద్యోగి జీవితం ఎలా ఉంటుందో కర్సన్‌బాయ్ జీవితం కూడా అలానే ఉంది. ఐతే అతని మెదడు అందరిలా ఆఫీసు ఐపోగానే ఇంటికి వచ్చి కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే జీవితంలో ఎంతో కొంత ఎదిగేందుకు ఏం చేయాలా? అని ఆలోచించాడు. తాను కెమిస్ట్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆలోచన వచ్చింది. 1985లో నిర్మా వాషింగ్ పౌడర్ తయారు చేసి సైకిల్‌పైన పెట్టుకుని ఆఫీసుకు వెళ్లే సమయంలో దారిలో అమ్మేవాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చేప్పుడు అమ్మేవాడు. మూడున్నరకు రూపాయలకు కిలో నిర్మా ప్యాకెట్ అమ్మేవాడు. 1985నుంచి 2000 వరకు నిర్మా వాషింగ్ పౌడర్ దేశంలో ఒక ఊపు ఊపేసింది. అప్పటికే ఉన్న బట్టల సబ్బులు, ఖరీదైన పౌడర్ల మార్కెట్‌ను ఒక్కసారిగా నిర్మా హస్తగతం చేసుకుంది. బహుళ జాతి కంపెనీలు నిర్మా ముందు కుదేలయ్యాయి. 1990 ప్రాంతంలో సంగారెడ్డిలో జరిగిన ఒక సభలో బిజెపి నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, గతంలో యువకులు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించమని మమ్మల్ని కలిసేవారు, ఇప్పుడు ఉద్యోగం కోసం కాకుండా నిర్మా డీలర్ షిప్ ఇప్పించాలని కోరుతున్నారని చెప్పారు.
నిజంగా ఆ కాలంలో నిర్మా పౌడర్ హట్ కేకుల్లా మార్కెట్‌ను ముంచెత్తింది. అప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న సబ్బుల పౌడర్ కన్నా చాలా తక్కువ ధర, నాణ్యత ఎక్కువ దీంతో నిర్మాకు ఎదురు లేకుండా పోయింది. నిర్మాకు దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది డిస్ట్రిబ్యూటర్లు, 20వేల ఔట్‌లెట్‌లు ఉండేవి. దీంతో మారుమూల గ్రామాలకు కూడా నిర్మా చేరువైంది.
వేలకోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకున్న నిర్మా ఎక్కడ మొదలైందో తెలుసా? కేవలం వంద చదరపు అడుగులు, అంటే ఒక్క చిన్న గదిలో ప్రారంభం ఐంది. ఆ గదిలో నిర్మా పౌడర్‌ను తయారు చేసి ఉద్యోగానికి వెళ్లేప్పుడు సైకిల్‌పై కొన్ని ప్యాకెట్లు తీసుకువెళ్లి అమ్మేవారు కర్సన్ బాయ్.
అతను కూడా అందరి మాదిరిగానే ఆఫీసు అయ పోగానే క్యాంటిన్‌లో రాజకీయ కబుర్లు, సినిమా ముచ్చట్లతో గడిపేస్తే ఈ రోజు అతని గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కోట్లాది మంది అప్పారావు, సుబ్బారావుల్లో ఒకడిగా మిగిలిపోయేవారు. సమయం లేదు, పెట్టుబడి లేదు, ఎవరూ సహకరించడం లేదు, మా బంధువులు సహకరించరు, ఇంట్లో సహకరించరు. అనే కుంటి సాకులు లక్ష ఉండొచ్చు. కానీ ఏదన్నా చేద్దాం, బాగుపడదాం.. అనే ఒక్క ఆలోచన ఉంటే చాలు- ఏదో ఒక మార్గం లభిస్తుంది. కర్సన్ బాయ్ పెట్టుబడి ఒక సైకిల్, ఇంట్లో ఒక గది అంతే. దాంతోనే ప్రపంచం దృష్టిలో పడ్డారు. విజేతగా నిలిచారు. అంబికా దర్బార్ బత్తి, క్రేన్ వక్కపొడి వంటి లెక్కలేనన్ని కంపెనీలు ఇలా సైకిల్‌పై మొదలైనవే. చందన, బొమ్మనలే కాదు ఇప్పుడు మార్కెట్‌ను ఏలుతున్న ఎంతో మంది వస్త్ర వ్యాపారులు ఒకప్పుడు బట్టల దుకాణాల్లో పని చేసి స్వయం శక్తితో ఎదిగిన వారే. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం చిన్న గదుల్లోనే పురుడుపోసుకున్నాయి. బాహుబలి సినిమా సెట్టింగ్‌ల్లో ప్రారంభం కాలేదు. బాహుబలి కేవలం గ్రాఫిక్ మాయాజాలం మాత్రమే. ఇరుకు గదిలో పుట్టిన మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
సైకిల్‌పై ప్రారంభం అయన ప్రతి వ్యాపారం వేల కోట్ల రూపాయలకు ఎదుగుతుందని కాదు.. కానీ ఊబుసుపోక కబుర్లతో కాలం గడపడం కన్నా- ఏదో ఒకటి చేయడం ద్వారా కచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి కన్నా మెరుగ్గానే ఉంటాయి.
కూలి పని చేసుకునే కొందరు మహిళలు ఇటీవల హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో జొన్నరొట్టెలు చేసి అమ్ముతున్నారు. కొందరు మహిళలు కర్రీ పాయింట్స్ నిర్వహిస్తున్నారు. టీవీ సీరియల్స్‌తో కాలక్షేపం కన్నా ఇవి కచ్చితంగా ముందుకు తీసుకు వెళతాయి. ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచనకు శ్రీకారం చుడితో ఏం చేయాలో ఆలోచన అదే వస్తుంది.

-బి.మురళి