తెలంగాణ

తాగుబోతుల ఘర్షణ: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఆటో డ్రైవర్ నర్సింహులు, శ్రీను శుక్రవారం రాత్రి కల్లు తాగి గొడవ పడ్డారు. ఘర్షణ ముదరడంతో పరస్పరం కొట్టుకున్నారు. ఆ క్రమంలో చేతికందిన బండరాయితో శ్రీను ఆవేశంతో నర్సింహులు తలపై గట్టిగా మోదాడు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.