జాతీయ వార్తలు

ఢిల్లీలో దారుణం: ఫ్యాషన్ డిజైనర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తమకు వేళకు జీతాలు సరిగా ఇవ్వటం లేదని తమ యజమానురాలిని పనివారు హత్య చేసిన సంఘటన ఇది. ఢిల్లీకి మలా లఖనీ అనే మహిళ నగరంలోని వసంత్‌కుంజ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన మలా లఖనీ (53) ఈరోజు తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. మలా లఖనీ ఇంటి తలుపులు తెరిచి వుండటం, సెక్యూరిటీ గార్డు కూడా కనిపించికపోవటంతో అనుమానం వచ్చి చూడగా ఆమె బెడ్‌రూమ్‌లోనూ, సెక్యూరిటీ గార్డ్ బహదూర్ మృతదేహం లివింగ్ రూమ్‌లో రక్తపు మడుగులో పడివున్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి మాలా లఖనీ వద్ద పనిచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా తమకు జీతం ఇవ్వటం లేదని చంపినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.