జాతీయ వార్తలు

ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఆప్‌తో పొత్తుపెట్టుకోవటం లేదు. ఢిల్లీలో ఏడు లోకసభ స్థానాలకుగాను ఆరు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మాజీ సీఎం షీలాదీక్షిత్ నార్త్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమెపై బీజేపీ అభ్యర్థిగా బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి పోటీ పడుతున్నారు. కాగా మిగిలిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. చాందినీ చౌక్‌ నియోజకవర్గం నుంచి జేపీ అగర్వాల్‌, ఈస్ట్‌ ఢిల్లీ నుంచి అర్విందర్‌ సింగ్‌ లవ్‌లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్‌ మాకెన్‌, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ నుంచి రాజేశ్‌ లీలోతియా, వెస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మహబాల్‌ మిశ్రా పోటీ చేయనున్నారు.