జాతీయ వార్తలు

ఢిల్లీకి రాష్టహ్రోదా సాధనే ధ్యేయం:కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా సాధనేపైనే మా ప్రదాన దృష్టి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఈరోజు ఆప్ మానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ లౌకిక భావజాలంతో ఏర్పడిన ఏ కూటమికైనా తమ మద్దతు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవటంపై ఆయన స్పందిస్తూ.. మోదీ, షా ద్వయం అధికారంలోకి వస్తే ఆ బాధ్యత రాహుల్‌దేనని అన్నారు. అసలు ఆయన ఏ కూటమిని ఏర్పాటుచేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని, దేశ ఐక్యత నేడు ప్రమాదంలో పడిందని, దానిని కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.