జాతీయ వార్తలు

ఓటమికి ఎవరినీ నిందించను:దేవెగౌడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తన ఓటమికి ఎవరినీ నిందించనని, తన ఓటమి పెద్ద విషయం కాదని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. కర్ణాటకలోని తుముకూరు నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జేడీఎస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రాంతీయ పార్టీలను రక్షించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని అన్నారు. తాను మాజీ ప్రధాని అయినప్పటికీ రెండుసార్లు ఓడిపోయానని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ రెండు పార్టీలు కలిసి ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా దేవెగౌడ తన కంచుకోటగా భావించే హాసన్ నుంచి బయటకు వచ్చి తుముకూరు నుంచి పోటీ చేశారు. హాసన్‌ను తన మనవడి రాజకీయ ఆరంగ్రేటం కోసం ఇచ్చారు. తాత కోసం తాను రాజీనామ చేసి తాతను పార్లమెంట్‌కు పంపేందుకు మనవడు రేవణ్ణ్ సిద్ధమైన సంగతి తెలిసిందే.