ధనం మూలం

బతకలేని పిహెచ్‌డిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతి, ధనలక్ష్మి ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు అని ఓ నానుడి. పేదరికం నుంచి విముక్తి కావాలి అంటే చదువు ముఖ్యం. ఇది అందురూ నమ్మే మాట! ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే రెండూ నిజమే.
ఇటీవల అమెరికాలో ఉన్నత విద్యావంతులు, పేదరికం అనే అంశంపై ఒక అధ్యయనం చేశారు. పిహెచ్‌డి డిగ్రీలు ఉన్నా పేదరికమే... ఉన్నత విద్యావంతుల్లో పేదరికం ఎందుకు అనే అంశంపై పలు ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 18్భషల్లో నిష్ణాతులు, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పని చేసిన విశేష అనుభవం కలవారు. జ్ఞాన సంపన్నులు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన వారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటి కేసు, దిగిపోయిన తరువాత కూడా కొనసాగింది. ఆ కేసు వాదించిన న్యాయవాదికి ఫీజు చెల్లించడానికి తన ఇంటిని అమ్మేశారు. పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఎంతో మంది కోటీశ్వరులు అయ్యారు. ఆయన్ని నమ్ముకుని, ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదించిన వారు ఉన్నారు. కానీ ఆర్థికంగా ఆయన పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. మరో మేధావి మన్మోహన్‌సింగ్ పరిస్థితి సైతం ఇంతే.
న్యాయవాదిగా బోలెడు సంపాదించిన ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. న్యాయవాదిగా సంపాదించిన డబ్బుతో మద్రాస్‌లో విలువైన భవనాలు కొనుగోలు చేసిన ఆయన చివరి దశలో పేదరికంలోనే గడిపారు.
ఇలాంటి వారిని చూశాక లక్ష్మీదేవికి, సరస్వతి దేవికి నిజంగానే పడదేమో అనిపిస్తుంది. అలాంటి మహనీయులు సంగతి వదిలేద్దాం. ఈ కాలంలో సామాన్యుల సంగతి చూద్దాం. ఎంతో మంది పిహెచ్‌డి చేసిన వారు కూడా ఉద్యోగం పేదరికంలో ఉండిపోయారు. ఉండిపోతున్నారు. పిహెచ్‌డి చేశారంటే వీరికి అ పారమైన జ్ఞానం ఉన్నట్టే కదా? మరెందుకు పేదరికంలో ఉన్నారు.
పిహెచ్‌డి అనేది ఒక డిగ్రీ సర్ట్ఫికెట్ మాత్రమే... జ్ఞానం వేరు సర్ట్ఫికెట్ వేరు. కొందరికి జ్ఞానంతో పాటు సర్ట్ఫికెట్ కూడా ఉంటుంది. కానీ చాలా మంది తాము పొందిన సర్ట్ఫికెట్‌నే తమ జ్ఞానం అనుకుంటున్నారు.
జ్ఞానం- సర్ట్ఫికెట్ రెండూ వేరు వేరు కాబట్టే చాలా మంది ప్రముఖ కంపెనీల యజమానుకు ఎంబిఎ పట్టా లేదు కానీ వేల మంది ఎంబిఏలకు ఉద్యోగాలు ఇచ్చారు.
సర్ట్ఫికెట్‌నే జ్ఞానం అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఎంబిఎ సర్ట్ఫికెట్ ఉన్నంత మాత్రాన వ్యాపారం గురించి వారి కంతా తెలుసు అనుకోలేం. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు వారికి వ్యాపారం గురించి పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే తెలుసు కానీ వ్యాపారంలో అనుభవం ఉండదు.
ఓ నలుగురు ఎంబిఏ విద్యార్థులు. వారు నివసించిన ప్రాంతాలు, కుటుంబ నేపథ్యాలు వేరు. చదివిన విశ్వవిద్యాలయాలు వేరు. ఎంబిఏ పూర్తి చేయగానే నలుగురు వివిధ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. ఎంబిఏ పూర్తయిన వారికి జీతం సాధారణంగానే ఉంటుంది. వారికి ఉద్యోగం సంతృప్తి నివ్వలేదు. వ్యాపార రంగం గురించి ఇంతగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాం, కానీ సంతృప్తి కలగడం లేదు. నలుగురం కలిసి ఏదైనా చేద్దాం అని రాయిపూర్‌లో ఈ నలుగురు గన్నావాలా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. అంటే ఏమీ లేదు. చెరుకు రసం అమ్మే షాప్. ఐతే చదువుకున్న వాళ్లు కాబట్టి కొత్తదనం చూపించారు. చెరుకు బండిపై చెరుకు రసం ఎలా అమ్ముతారో మనకు తెలుసు. అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. కానీ వీళ్లు దానికి కొత్త రూపం ఇచ్చారు. పరిశుభమ్రైన వాతావరణం, దానికో బ్రాండ్ నేం. చక్కని కేఫ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో అలా. ఊహించని విధంగా పెరిగిన టర్నోవర్, జీతం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఆదాయం. సందీప్ జైన్, వికాస్ ఖన్నా, అమిత్ అగ్రవాల్, అంకిత్ సర్వాగి. వీళ్లంతా రాయపూర్‌లోని సాలెం స్కూల్‌లో చదివారు. తరువాత వేరువేరు ప్రాంతాల్లో ఎంబిఏ చేశారు. మంచి కంపెనీల్లోనే ఉద్యోగాలు లభించినా సంతృప్తి కలగలేదు. ఇప్పుడు జీతం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఆ మధ్య మద్రాస్‌కు చెందిన ఒక ఐఐటి విద్యార్థి కూడా ఐఐటి తరువాత మంచి ఆఫర్ వచ్చినా వద్దని ఇడ్లీ వ్యాపారం మొదలు పెట్టారు. నిజానికి తన తల్లి ఓ పేదరాలు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మి చదివించింది. కానీ అతను ఇడ్లీ వ్యాపారానికి తన జ్ఞానాన్ని కూడా జోడించి విజయం సాధించాడు.
డిగ్రీ సర్ట్ఫికెట్ మాత్రమే జ్ఞానం కాదు. అలా సర్ట్ఫికెట్‌నే జ్ఞానం అనుకునే వారు అక్కడే ఉండిపోతున్నారు. పిహెచ్‌డి ఐనా పేదరికమే అనే సర్వేలో తేలింది ఇదే.
స్కూల్‌లో చదువు చెబుతారు కానీ జీవితానికి అవసరం అయిన జ్ఞానం మనమే సంపాదించుకోవాలి. ఏ స్థాయి చదువు అయినా కావచ్చు, స్కూల్ మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అక్కడ ఉద్యోగులను తయారు చేసే చదువే ఉంటుంది కానీ సంపన్నులుగా మార్చే చదువు ఉండదు. లెక్కల్లో ఎంత జ్ఞాని అయినా కావచ్చు కానీ డబ్బులు సంపాదించే లెక్కలు వేరుగా ఉంటాయి. జీవితానినికి అవసరం అయిన డబ్బును ఉద్యోగం ద్వారా ఎలా సంపాదించుకోవాలో చదువు నేర్పుతుంది కానీ సంపన్నులు కావడానికి ఎలాంటి అలోచన ఉండాలో చదువు నేర్పించడం లేదు. మార్కులు, డిగ్రీలు జ్ఞానాకి కొలమానం కానే కావు.
ఎంబిఏ డిగ్రీతో ఒక పాన్ షాప్ కూడా నడపలేక పోవచ్చు, కానీ ఏ చదువు లేకపోయినా పాన్‌షాప్‌తో బోలెడు సంపాదించిన వారు ఉన్నారు. పెద్దగా చదువు లేని వారు దాదాపు 20ఏళ్ల వయసులోనే సంపాద కోసం ఏదో ఒక వృత్తిలో స్థిరపడితే, బాగా చదువుకున్న వారు 25ఏళ్ల వయసు తరువాత జీవనోపాధి కోసం ఉద్యోగ వేటలో పడతారు. అంటే చదువువారు ఉద్యోగం కోసం ప్రయత్నించే నాటికి పెద్దగా చదువులేని వారు అప్పటికే సంపాదనలో పడిపోయి ఐదేళ్లు అవుతుంది. చదువుకున్న ఉద్యోగిగి ఉద్యోగం పోతుందేమో అనే భయం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఇది కాకపోతే ఇంకో వ్యాపారం అనే ధైర్యం ఉంటుంది. వ్యాపారం మినహా తనకు మరో మార్గం లేదు అని గ్రహించడం వల్ల అతను సర్వశక్తులు వ్యాపారంలో పెడతారు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది సంపన్నులను తయారు చేయలేదు. ఉద్యోగులను మాత్రమే తయారు చేస్తుంది. చదువును వ్యతిరేకించడం కాదు. చదువు అంటే కేవలం డిగ్రీలే కాదు అని చెప్పడం. రాయిపూర్‌కు చెందిన ఆ నలుగురు యువకులు చదువు ద్వారా తాము గ్రహించిన జ్ఞానాన్ని, వ్యాపారం చేయాలనే తమ అభిరుచిని రెండింటిని కలపడం ద్వారా గనే్నకా రస్ కెఫ్ అనే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఏ చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం అయిన నిజమైన జ్ఞానాన్ని గ్రహించాలి. ఐఐటి చదివినా, ఎంబిఎతో ఉద్యోగాల్లో చేరినా తమ జీవిత లక్ష్యం ఏమిటో గ్రహించారు. ఉద్యోగంతో సంపన్నులం కాలేం, వ్యాపారంతోనే అది సాధ్యం అని గ్రహించారు వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా పని చేయడం తప్పు కానీ సంపన్నులు కావాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ చిన్న పని నుంచి మొదలు పెట్టినా అది తప్పు కాదని నేటి తరం యువత కొందరు ఇతరులకు మార్గం చూపుతున్నారు.

-బి. మురళి