జాతీయ వార్తలు

మళ్లీ రంగంలోకి డీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కర్ణాటక మంత్రి డికే శివకుమార్ మళ్లీ రంగంలోకి దిగారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించటంతో కాంగ్రెస్ మంత్రి అయిన శివకుమార్ తన బుజ్జగింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం తెల్లవారు జామున అసమ్మతి ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్ కూడా ఉన్నారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఇదిలావుండగా అంతకుముందు ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గం, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డితోనూ శివకుమార్ చర్చలు జరిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు బెంగళూరు రావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. కాగా అసమ్మతి ఎమ్మెల్యేలు అంతా ఆలయాలను దర్శించుకుంటున్నట్లు తెలిసింది.