ఆంధ్రప్రదేశ్‌

తల్లి,బిడ్డ మృతితో ఆస్పత్రి వద్ద ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి నిండు గర్భిణిని ప్రసవం నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఆమె బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను తీసుకువచ్చిన చాలా సేపటికి- గర్భంలో శిశువు అడ్డం తిరిగినందున సిజేరియన్ ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్ చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్ చేశాక బిడ్డ మరణించినట్టు డాక్టర్ తెలిపారు. కాసేపటికి తల్లి కూడా మరణించిందన్న సమాచారం బంధువులకు చెప్పారు. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.