ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టులతో ఎపికి అన్యాయం చేయవద్దు: డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎపికి అన్యాయం జరగని రీతిలో తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టవచ్చని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, రెండు తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్రం పరిష్కరించాలన్నారు. కమీషన్ల కోసమే ఇపుడు తెలంగాణ సర్కారు పాలమూరు పథకానికి జీవోలు జారీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉండగా తాను ఈ పథకాన్ని వ్యతిరేకించానని ఆయన గుర్తు చేశారు. కాగా, ఎపి సిఎం చంద్రబాబుపై తప్పుడు విమర్శలు చేసే బిజెపి నాయకులను ఆ పార్టీ అధిష్ఠానం దండించాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టేలా వైకాపా అధినేత జగన్ మాట్లాడడం సరికాదన్నారు.