రాష్ట్రీయం

దుర్గగుడి సిబ్బందికి నేటినుంచి డ్రెస్‌కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అతిపెద్ద విజయవాడ దుర్గగుడిలో పరిపాలనా సంస్కరణలకు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర ఆజాద్ శ్రీకారం చుట్టారు. వివాదాల్లో చిక్కుకున్న ఇవో నరసింగరావు సెలవుపై వెళ్లడంతో చంద్రశేఖర ఆజాద్ ఇవోగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చట్టప్రకారం ఆలయ ఉద్యోగులందరూ డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ ఆదివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. చట్టప్రకారం ఉద్యోగులంతా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సి వున్నప్పటికీ గతంలో పలువురు ఇవోలు చూసీచూడనట్లు వ్యవహరించటంతో దానికి కాలం చెల్లినట్లయింది. అయితే సోమవారం నుంచి విధిగా ఉద్యోగులంతా తెల్లని వస్త్రాలు ధరించి తిలకం, విభూది ధారణ చేయాల్సి వుంటుంది. ఇంజనీరింగ్ సిబ్బంది మాత్రం తెలుపు, గోధుమ రంగు వస్త్రాలు ధరించవచ్చని ఆదేశాల్లో ఆజాద్ పేర్కొన్నారు.