సంపాదకీయం

సభలు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినిపించిన సమన్వయ వాణి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు విచిత్రమైన నేపధ్యం! నరేంద్ర మోదీ ఈ సర్వజనామోద-కాన్సనె్సస్-విధానాన్ని మరోసారి ఈనెల 16వ తేదీన ఆవిష్కరించిన సమయంలోనే ప్రతిపక్షాలవారు సంఘర్షణ స్వరాలను యధావిధిగా సంధించారు! వెరసి కలసి నిగ్గుతేలుతున్నదేమిటంటే పార్లమెంట్ హేమంత సమావేశాల కథ బడ్జెట్ సమావేశాలలో సైతం పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉన్నది! గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్-వస్తు, సేవల పన్నుల-జిఎస్‌డిను పార్లమెంట్ ఆమోదించ గలదన్న ఆశాభావం శీతాకాల సమావేశాల పొడవునా దోబూచులాడింది. ఆ తరువాత అధికార విపక్షాల మధ్య యధాతథంగా ఘర్షణలు మొదలైపోయాయి! ప్రభుత్వం వారి సమన్వయ దృక్పథం, ప్రతిపక్షాల అవగాహన ధోరణి బడ్జెట్ సమావేశాలకు హేమంత సమావేశాలనుంచి లభించిన వారసత్వం. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జాతి విద్రోహకర కలాపాలకు నిలయమై పోయిందన్న ఆందోళనల మధ్య జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్య చిటపటలను సృష్టించడం ఖాయమన్న ప్రచారం మొదలైపోయింది! ఈ సమస్యపై దేశభక్తిగల, జాతీయతా సమైక్యతా నిష్ఠకల, రాజ్యాంగ నిబద్ధతకు అన్నివర్గాలవారు ఏకగ్రీవ వాణిని వినిపించాలన్నది ఈ దేశ ప్రజలు కోరుతున్నది...కానీ అలాంటిదేమీ ఉండబోదన్నది ముందుగానే స్పష్టమైపోయింది. జాతిహితకరమైన అన్ని సమస్యలపట్ల రాజకీయ పక్షాలు తమ విధా న విభేదాలను విస్మరించి సమాన అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్నది ప్రజాస్వామ్య స్పూర్తి! అధికసంఖ్యాక- మెజారిటీ- ఆమోదంతో మాత్రమే కాక సర్వపక్షామోదం-కానె్సన్సస్-ప్రాతిపదికగా పార్లమెంట్ సభలు, శాసనసభలు నిర్ణయాలు తీసుకోవాలన్న సూత్రానికి ఇదీ ప్రాతిపదిక! కానీ ఏది దేశ హితకరం? ఏది జాతికి సమష్టి ప్రయోజనం? అన్న అంశాలే భయంకర వైరుధ్యాలకు గురి కావడం ప్రజాస్వామ్య వ్యవస్థను, సార్వభౌమ అధికారాన్ని, వౌలిక సంస్కృతిని, జాతీయతను అపహాస్యం పాలు చేస్తున్న విపరిణామం! పార్లమెంట్ భవనంపై దాడి చేసిన దేశవిద్రోహి అఫ్జల్ గురుకు మరణశిక్షను అమలు జరపడాన్ని సైతం వ్యతిరేకిస్తున్న వారు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా చెలామణి అవుతున్నారు! ఈ దేశ విద్రోహ ప్రవృత్తిని తుదముట్టించడానికి ప్రభుత్వం తలపెట్టిన చర్యలను ప్రతిపక్షాలు సమర్ధించాలి! వ్యతిరేకిస్తుండడం దేశ ప్రజలను మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని విస్మయగ్రస్తం చేసిన వైపరీత్యం! ఈ వ్యతిరేకతను పార్లమెంట్ సమావేశాల్లో సైతం ప్రదర్శించడానికి ప్రతిపక్షాలు పూనుకుంటున్నాయిట! అందువల్ల బడ్జెట్ సమావేశాలు కల్లోలగ్రస్తం కావడం ఖాయం!
ఇలా కల్లోల గ్రస్తం కాకుండా నివారించడానికి గత శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రదర్శించిన అపరిమిత సమన్వయం సహనం ప్రతిపక్షాలు సంధించిన అసహ్యం ముందు పరాజయం పాలయ్యాయి. వస్తుసేవల పన్నుల-జిఎస్‌డి బిల్లును రాజ్యసభలో గట్టెక్కించుకోవడం కోసం ప్రధాన మంత్రి మొదలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వరకు గల ప్రభుత్వ ప్రతినిధులు అందరు ప్రతిపక్షాలతో మంచిగా మాట్లాడినారు! అఖిల పక్ష సమావేశాల ద్వారా, ద్వైపాక్షిక చర్చల ద్వారా కాంగ్రేస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాధాన్యాన్ని మితిమీరి పెంచడానికి మాత్రమే దోహదం చేసింది.గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సభలలో ఏకాభిప్రాయ సాధనకు జరిపిన కృషిని మోదీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకు గుర్తు చేసారు! జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా వుండిన సమయంలో పార్టీలోను, పార్లమెంటులోను బయట ఎదురయ్యే భిన్నాభిప్రాయం పట్ల తీవ్రమైన అసహనం ప్రదర్శించేవాడన్నది చరిత్ర చెబుతున్న సాక్ష్యం! ఆయనపట్ల కాంగ్రెస్ వారి భక్తి పార్లమెంటు సభలలో ఆరోజులలో కాంగ్రెస్‌కుండిన తిరుగులేని ఆధిక్యంవల్ల నెహ్రూ ప్రభుత్వం సమన్వయం సిద్ధాంతం జోలికి వెళ్లవలసిన పని పడలేదు! అయినప్పటికీ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం సైతం సభలలో ఏకాభిప్రాయ సాధనకోసం తపించినట్టు హేమంత సమావేశాల సందర్భంగా నవంబర్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. నరేంద్రమోదీ సోనియాగాంధీని మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌నుకలిసి వస్తు సేవల సంకం బిల్లును రాజ్యసభలో సమర్ధించవలసినందిగా కోరి వున్నారు. ఈ సహకార సమీకరణ సంఘర్షణగా మారి శీతాకాల సమావేశాలు ముగిసిపోవడం చరిత్ర...
గత ఏడాది వర్షాకాల సమావేశాలు అసహనంపై జరిగిన ఆర్భాటపు బురద ప్రహసనంలో కొట్టుకునిపోయాయి. హేమంత సమావేశాలు నేషనల్ హేరాల్డ్ సంస్థలో జరిగిన అవినీతి కలాపాలలో గడ్డకట్టి మూలిగాయి. నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారాలలో సోనియాగాంధీ ఆమె తనయుడు రాహుల్‌గాంధీ నడిపిన అక్రమ అవినీతి కలాపాలు బయటపడడం కేవలం సాకుమాత్రమే! ఈ సాకు దొరకకపోయి ఉండినట్టయితే మరోసాకు సిద్ధమయ్యేది. అందువల్ల ప్రతిపక్షాలు తమకు సహకరిస్తాయన్నది నరేంద్రమోదీ ప్రభుత్వం వారి భ్రాంతి మాత్రమే! ప్రతిపక్షాలున్నది ఫ్రభుత్వ కార్యక్రమాలు అంగుళం మేరకు ముందుకు జరగకుండా ప్రతిఘటించడానికేనన్నది గత ఇరవై నెలలకుపైగా స్పష్టమైపోయిన వాస్తవం! అందువల్ల ప్రభుత్వంవారు రూపొందించి సభలకు నివేదిస్తున్న బిల్లులను ప్రతిపక్షాల వారు సమర్ధించబోరు! గత సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రభుత్వం జరిపిన సయోధ్య చర్చలలో పాల్గొన్నది. కానీ ఈ బడ్జెట్ సమావేశాలకు పూర్వరంగంగా పదహారవ తేదీన జరిగిన అఖిలపక్షానికి సోనియాగాంధీ రానేలేదు. అఖిల పక్షానికి హాజరు కావడం తనకు వీలు కాదని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ఎమ్.వెంకయ్యనాయుడికి ఆమె ఉత్తరం రాసిందట! పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగనివ్వబోమన్నదే ప్రతిపక్షాల విధానమన్నది అఖిలపక్షంలో కూడ స్పష్టమైపోయింది...
ప్రజలు తమను ఎన్నుకున్నది పరిపాలనను నిర్వహించడానికని, ప్రతిపక్షాలను బుజ్జగిస్తూ కాలక్షేపం చేయడానికి కాదని భాజపా నాయకత్వంలోని ప్రభుత్వం వారు ఇప్పుడైనా గ్రహించాలి! మాతృదేశం ద్రోహులను సమర్ధించేవారితోను, వారిని సమర్ధించేవారితోను సయోధ్య సమన్వయం ఏకాభిప్రాయం వంటివి జనం మెచ్చని మెతక విధానాలు! సభల నియమాలకు అనుగుణంగా ప్రతిరోజు పూర్తి సమయంతో పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి! దేశహితకర సమస్యల గురించి ప్రతిపక్షాలు ధ్యానాకర్షణ వంటి చర్యలకు పూనుకుంటే తప్పులేదు. స్పీకర్ వెంటనే అనుమతించినట్టయితే పేచీలేదు! కానీ దేశ విఘాతకర ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించి సభలలో అడ్డుకునేవారిని మొదట హెచ్చరించాలి, తరువాత సభా రక్షకుల -మార్షల్స్-సహాయంతో వారిని బయటికి పంపి వ్యవధి ముగిసేవరకు నిర్ణీత కార్యక్రమాలను కొనసాగించాలి! జనం చూస్తున్నారు...