వీరాజీయం

ఇండో పాక్ సమస్యలు వర్ధిల్లాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యో! ఎంత మాట? ఇండో పాక్ రిలేషన్స్ వర్ధిల్లాలీ అనబోతుంటే ఇలా వచ్చేసింది. నోరు జారితే తీసుకోలేం అన్నారుగా, అందుచేత దాన్ని అలాగే ఒగ్గేసి- అటు ‘జిట్’ యిటు ‘ఎన్.ఐ.ఏ’ల రిలేషన్స్ బ్రహ్మాండంగా వున్నాయి’ అన్న సమాచారాన్ని చూద్దాం- ‘జిట్’ అని అనగా ఇండో పాక్ పఠాన్‌కోట్ సంఘటన మీద జాయింట్ ఇనె్వస్టిగేషన్ కమిటీ- మరి ఎన్.ఐ.ఏ. అనగా నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ- పఠాన్‌కోట విమాన స్థావరం మీదకి జనవరి రెండున తెల్లారగట్ల జైషే మహమ్మద్ టెర్రరిస్టు గ్రూప్‌కి చెందిన సాయుధులు అతికీలకమైన గట్టి కాపలా నీడన ఉన్న మన ఎయర్‌బేస్ మీద విరుచుకుపడ్డారు. మన భద్రతా దళానికి చెందిన ఏడుగురు వీరస్వర్గమలం కరించగా టెర్రరిస్టులలో ఐదు గురు హతమయ్యారు. మిగతా కథ అంతా తెల్సిందే.
అటు తర్వాత మన ప్రభుత్వం చాకచక్యంగా వ్యవ హరించి మార్చి చివరివారంలో ‘‘జిట్’’ను సాధించింది. ‘‘జిట్ సభ్యులు’’ వచ్చారు. మనవాళ్లేదో తప్పుచేశారు అన్నట్లు- మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు అన్నీ యివ్వండి. మీ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాం అంటూ అన్నిరకాల ఋజువులూ సాక్ష్యాలు మూటకట్టుకుపోవాలీ అని వారంటే అందరం మురిసిపోయాం. మనవాళ్లు, పాక్ పరిశీలక సం ఘానికి లేదా దర్యాప్తు సంఘానికి ఎంతో సహకరించారని కూడా వాళ్లే అంగీకరించారుట! పైగా ‘‘ఎన్.ఐ.ఏ’’వారి నిజాయితీని కూడా వాళ్లు ప్రశంసించారు. భారత్‌కి చెందిన ఎయిర్‌బేస్ మీద దాడి చేసిన వారిలో నలుగురు పాకిస్తానీ పౌరులు ఉన్నారు అన్నమాటని కూడా జిట్‌వారు కొట్టిపారేయలేదు. కాకపోతే పాకిస్తానీ బృందం మనవాళ్ళు చూపించిన పద ముగ్గురునీ క్షుణ్ణంగా పృచ్ఛించారు. అంతా రాసుకున్నారు. వీరిలో గురుదాస్‌పూర్ యస్.పి. సాల్వీందర్‌సింగ్ కూడా వున్నారు. ఈ భోగట్టా అంతా వాళ్ళకి అందించే ముందు మనవాళ్లకు సంబంధించి కోర్టువారికి ఓ ‘‘మాట’’ చెప్పాలిట. కాని అతిథులకి మర్యాద చేయడంలో నిమగ్నులై రుూ కోర్టుకి సమాచారం ఇవ్వాలి అన్న సంగతి మర్చిపోయారుట. అంటే రేపు కోర్టుముందు అక్కడ పాక్‌లో గాని యిక్కడ ఇండియాలో గాని రుూ వ్యవహారం విచారణకి వస్తే ‘‘స్టే’’అనో లేక ‘‘నో’’అనో న్యాయస్థానాలు అంటే దిక్కులేదుట. అది అలా వుంచండి. అక్కడ దాకా పోవడానికి చాలా టైముంది. కాని మనవాళ్లు రుూలోగా ఒక రిక్వెస్టు పెట్టుకున్నారు. ‘‘అనుమానితుల మీద- అలాగే ఈ దారుణ మారణ దాడికి కుట్ర పన్నిన మవులానా మసూద్ అజర్, అబ్దుల్ రవూఫ్, ఖాసిమ్‌ఖాన్, షాహిద్ లతీఫ్ వాళ్ల అనుయాయులు మరో ఐదుగురి మీద కూడా ‘‘చర్యలు తీసుకోవాలి సార్’’అన్నారుట. మీరు వాళ్ల డి.ఎన్.ఎ. శాంపిల్స్ మాకు యిస్తే మేం మా వాళ్ల డి.ఎన్.ఎ. శాంపిల్స్‌ని జన్యుపరీక్షల నిమిత్తం యిస్తాం’’అని వినయంగా మనవి చేశారు.
‘‘ఈ సాక్ష్యం అంతా కోర్టుముందు పెట్టాలిగా- ఈలోగా తొందర పడడం ఎందుకు అంటూ ‘‘జిట్ సభ్యులు చిరునవ్వులు చిందించారని ఎన్.ఐ.ఎ.వర్గాల భోగట్టా. కాకపోతే జైషే మహమ్మద్ గ్రూపు టెర్రరిస్టులు బోర్డర్ దాటి హ్యాపీగా ఎయిర్‌బేస్ దాకా వచ్చేశారన్న దానికి యింకా కొంత సాక్ష్యాలు కావాలేమోనన్నారుట వారు. భారత్ దర్యాప్తు సంఘం సభ్యుల్ని పాకిస్తాన్‌కు రమ్మని ఆహ్వానించారు. అది ఎప్పుడో? మరి టైము కావాలిగా ఆ విధంగా- యిది చ్యూయింగ్‌గమ్ అవుతుంది-
ఇది ఇలావుండగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారు అమెరికా పర్యటనలో వున్నవాడు- పోయినసారి క్రిస్‌మస్ గ్రీటింగ్స్ పట్టుకొని నేరుగా పాకిస్తాన్‌లో దిగి- పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్పి అటు తరువాత షరీఫ్‌గారి మనుమరాలి పెళ్లికి ఆశీస్సులందించి వచ్చారు. ఈ దొడ్డ మనసుగల మోదీజీ వెనకాతలే పాక్ ప్రధాని దుశ్శాలువ, మోదీ మాతృమూర్తికి జరీ చీర వగైరాలు వస్తాయి అని అనుకుంటూ వుంటే నూతన సంవత్సర కానుకగా మన ‘‘ఎయిర్‌బేస్’’మీద ‘పఠా పఠా’ కాల్పులు జరిగాయి. మన జనవానులు ముగ్గురు వీర స్వర్గం చేరుకున్నారు. సరేలెండి మన హోంమంత్రిగారు గట్టిగా గంభీరంగా జవాబు (తన గంభీర కంఠం తో) యిచ్చాడనుకోం డి- ఇది యిలావుండగా రుూసారి అమెరికాలో మోదీజీ- ‘‘పాకిస్తాన్ అణ్వాయుధాల్ని తెగ తయారుచేసేసుకుంటుందీ... అణుబాంబు శకటాల్ని కూడా రెడీ చేసేసుకుంటున్నదీ అని బోలెడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
‘‘అబ్బే మేం ఏవో యుద్ధవిమానాలు యిస్తున్నాం అంతే. ఎన్ని? వో ఎనిమిది మాత్రమే యిస్తున్నాం’’అంటూ అమెరికన్ వర్గాలు చెబుతూ వుండగా- అక్కడే వున్న చైనా అధ్యక్షులవారు ఇక్‌జీ జింపింగ్‌గారు తాను వచ్చిన ‘‘నూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్’’ (అణుభద్రతా శిఖరాగ్ర సమావేశం) మాట ప్రక్కనబెట్టి ‘‘టెర్రరిస్టుల అణిచివేతలో అమెరికా చైనాలు ఇండియాని కూడా ఓ కంట కనిపెట్టాలీ’’అని పరోక్షంగా దెప్పిపొడిచాడు. అంతేనా? పఠాన్‌కోట దాడికి కూడా మూలకారకుడైన జైషే మహమ్మద్ మసూద్ అఝార్‌ని నిషేధించాలని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించాలని మనం ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తిచేసుకుంటున్న తరుణంలో ఇండియా ప్రయత్నాల మీద ముందే గండికొట్టాడు. అఝా ర్ లాంటి పెద్దమనిషిని ‘‘బ్యాన్’’ చేయడమా? వీల్లేదన్న చైనా మన పొరుగు దేశం- అది సరిలెండి మన ప్రధానమంత్రి టెర్రరిజం మీద తప్ప మిగతా ఎన్నో అంశాల మీద పాక్, చైనా, బంగ్లా, నేపాల్ లాంటి పొరుగు దేశాల సంబంధాలని కేవలం తన వాక్చాతుర్యంతోటే సాధిస్తున్న సంగతి గుర్తించాలి. లేదా మనం కూడా రాహుల్‌గాంధీ పార్టీ అయిపోతాం. దేశం మొత్తంమీద అసలు పాకిస్తాన్ దర్యాప్తు సంఘాన్ని మన గడ్డమీద దర్యాప్తుకి రానివ్వడం, తప్పు అని కాం.పా. దాని మిత్రపక్షాలు గోలచేస్తుంటే కనీసం యూనివర్సిటీ ‘‘కోట’’ల లోపలినుంచైన రుూ మంచి పనికి ‘‘శభాషులు’’రావటం లేదు. ‘‘పఠాన్‌కోట దాడి’’ కథ లిటిగేషన్ పర్వంలో ప్రవేశిస్తే యిక అంతే సంగతులు!
మనవాళ్లు పొట్లాంగట్టి యిచ్చిన ‘‘ఎవిడెన్స్’’ షికార్లు కొడుతుందే తప్ప ప్రోగ్రెస్ నిల్ అంటూ వ్యాఖ్యానించాడొక నిరాశావాది. యాభై ప్రపంచ దేశాలు పాల్గొంటున్న విశ్వ అణుభద్రతా శిఖరాగ్ర సభలో ప్రధానమంత్రి చురుకుగా పాలుగొన్నాడు. (పాలుతప్ప మరేమీ గ్రోలడు) అన్న సంగతి గమనించాలి. ఆయన గంభీరంగా ఎన్నో సంగతు లు ఒబామా ప్రభృతి నాయకులకు- ఇంగ్లీషు, హిందీలలో చెప్పిన తరువాత ‘‘ట్వీట్స్’’ ఎలాగా వస్తాయి- వచ్చాయి పఠాన్‌కోట, జైషే మహమ్మద్ గ్రూపులాంటి లోకల్ (?) ‘‘యిస్యూలు’’ అక్కడకి అంటే అమెరికాకి రాకుండా చైనాఅడ్డంగా పడుకుంది. గావున మనం మోదీగారిని ఏమీ అన లేం- రాహుల్‌గాంధీకే ఆ ‘‘్ఛన్సు’’ యిద్దాం,
బై ది బై మన ప్రధానమంత్రిగారు ‘‘సమ్మిట్’’నుంచి నేరుగా సౌదీ అరేబియాకి వెళ్లిపోయాడు. గనుక పఠాన్‌కోట సంగతి అందాకా వెనుకకి బెట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల జాతర తిలకిద్దాం.
లెట్ ఇండో పాక్ రిలేషన్స్ గో టు బ్యాక్ బర్నర్.