మెయన్ ఫీచర్

బిహార్‌లో ఆటవిక రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గుడారం రోజు కిరాయి ఐదువేలు. మూడు నెలలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెంట్ వేసి విద్యార్థుల చేత ధర్నాలు చేయిస్తున్నారు. ఇంత డబ్బు విద్యార్థులకు ఎక్కడినుండి వచ్చింది? అంటే విద్యార్థి సంఘం పైన రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా పెరిగింది’’, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజకుమార్ సాహు మే 10న ఒక పత్రికా విలేకర్ల సమావేశంలో అన్న మాట ఇది. సిపిఐ(ఎం) ధోరణికి నిరసనగా ఆయన తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారిలో రాజకుమార్ సాహు ఒకరు. ‘్భరతదేశాన్ని ముక్కలు చేయండి’ అంటూ నినాదాలిచ్చిన న్యూఢిల్లీలోని మార్క్సిస్టు విద్యార్థి నాయకునికి బెయిల్ ఇప్పించడానికి లక్షల రూపాయలు దుబాయ్ నుంచి ఎవరు పంపించారు? విమానాల్లో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వివిధ విశ్వవిద్యాలయాలు పర్యటించి చైనా అనుకూల ప్రచారం చేస్తున్నాడు. ఇంత డబ్బు పేద ప్రజల పార్టీకి ఎక్కడిది? ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుకుంటున్నది చైనా. కాశ్మీరును భారత్‌నుండి విడదీయడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తున్నది చైనా. కాశ్మీరుకు అణు పరిజ్ఞానాన్ని అందిస్తున్నది. ఇండియాలో చట్టబద్ధంగా చైనా అనుకూల రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. మరి చైనాలో ఇండియా అనుకూల విద్యార్థి సంఘాలు షాంఘై, బెజింగ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయా?
బిహార్‌లో జెడియు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆరువందల అత్యాచారాలు, హత్యలు జరిగినట్టు అధికారికంగా తెలుస్తోంది. జెడియులో ఎంఎల్‌సి మనోరమ కుమారుడి నిక్‌నేమ్ రాఖీ. అసలు పేరు రాజీవ్ యాదవ్. ఆయన మే 7వ తేదీన బుద్ధగయ సమీపంలో ప్రయాణం చేస్తుండగా ఆదిత్య సిన్హా అనే యువకుడు రాఖీ కారును ఓవర్‌టేక్ చేశాడు. అంతే-ఆదిత్య సిన్హాను రాఖీ కాల్చి చంపాడు. పోలీసులు పట్టుకుంటే సంఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనన్నాడు. తాను న్యూఢిల్లీలో ఉన్నానన్నాడు. ఈ జంగిల్ రాజ్‌కు రూపకల్పన చేసింది లల్లూ ప్రసాద్ యాదవ్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నితిశ్ కుమార్ 2019లో ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మొన్న రైలులో టిక్కెట్ లేకుండా తాగిన మత్తులో ఓ అధికార పక్ష నాయకుడు రైలు ఎక్కి ఒక అమాయక మహిళపై అత్యాచారం చేసిన వార్త సంచలనం సృష్టించింది. ఇదే బిహార్ నిజస్వరూపం. ఇక్కడినుండి వచ్చిన ఉగ్రవాదిని ఇషత్ జహాన్ మానవబాంబుగా మారి 2004లో అహమ్మదాబాదులో నరేంద్ర మోదీ, అమిత్‌షాలను చంపాలని ప్రయత్నిస్తే ఆమెను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపారు. అప్పుడు దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు ‘బిహార్ ముద్దుబిడ్డను మోదీ పొట్టన పెట్టుకున్నాడు’ అని చేసిన అల్లరి జగద్విదితం. భారతదేశంలో ఇవ్వాళ ప్రజలకు రక్షణ లేదు. బిహారులోనే కాదు దేశంలోని చాలా భాగాల్లో అటవిక రాజ్యం నడుస్తోంది.
నితిశ్ కుమార్, లల్లూ యాదవ్ పప్పుయాదవ్‌ల జంగిల్ రాజ్యానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌లు మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు ఆ పార్టీలూ, వారికి ఓట్లు వేసిన ప్రజలూ ఆదిత్య సిన్హా హత్యకు బాధ్యత వహించాలి. మనోరమాదేవిని తాత్కాలికంగా జెడియు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆదిత్య సిన్హా తండ్రి మాట్లాడుతూ మాకీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అని చెప్పాడు. మరి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నందుకు నానా అల్లరి చేసిన కన్హయ్యకుమార్, ఆదిత్య సిన్హాకు జరిగిన అన్యాయానికి కనీసం స్పందించనైనా లేదు. ఎందుకని? అంటే స్మృతి ఇరానీ విషయంలో ఒక నీతి, లలూప్రసాద్ యాదవ్ విషయలో మరొక నీతి ఈ దేశంలో ఉందా? ఏచూరి సీతారామ్, షబనా ఆజ్మీ, రాహుల్ గాంధీలు ఆదిత్య సిన్హా కుటుంబాన్ని ఓదార్చడానికి ఎందుకు వెళ్లలేదు? ఎందుకంటే బిహారు మంత్రివర్గంలో అక్కడి అటవిక రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం వహిస్తున్నది.
పాట్నాలోని జెడియు ఎంఎల్‌సి మనోరమాదేవి భర్త బిందీ యాదవ్ జైలులో ఉన్నాడు. మనోరమ గదిలో లిక్కర్ బాటిళ్లు దొరికాయి. ప్రస్తుతం బిహారులో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది కదా. దీనికి నితీశ్‌కుమార్ ఏం సమాధానం చెబుతారు? ఇక హత్య జరిగినప్పుడు తన కొడుకు ఢిల్లీలో ఉన్నాడనే సాక్ష్యం పుట్టించే నిమిత్తం మనోరమ ప్రయత్నించింది. రక్తం మరకలు గల బట్టలను దాచిపెట్టింది. వాటిని ఇప్పుడు ఫోర్సెన్సిక్ లేబొరేటరీకి పంపారు. మనోరమ దగ్గర ఒక చిన్న పిల్ల పనిచేస్తుంది. బిహారులో బాల కార్మిక వ్యవస్థపై నిషేధం అమల్లో ఉంది. మరి ఈ నేరాలన్నింటికి జెడియు అధినేత నితిశ్‌కుమార్ సమాధానం చెప్పాలి.
మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అది నేవీ దళానికి సంబంధించిన ‘ట్యాంకర్ల’కు సంబంధించినది. రష్యా వారి మూడు ట్యాంకర్ల స్టీలు బలంగా ఉన్నా, స్థాయిలేని ఉక్కుతో నిర్మించిన ఇటాలియన్ ట్యాంకర్లను ఎందుకు కొన్నారు? ఇందుకు సంబంధించి అక్టోబరు 2009లో విచారణ మొదలైంది. అది ముందుకు సాగలేదు. ట్యాంకర్లు, అగస్టా, బోఫోర్స్..వీటన్నింటిలో ఇటాలియన్ కనెక్షన్ గమనార్హం. 2010 కాగ్ నివేదికలో అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. వాటిని ఎందుకు కొన్నారు? రష్యాను పక్కనబెట్టి, ఇటాలియన్ ట్యాంకర్లను ఎవరి ప్రేరణతో యుపిఎ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది? చైనాతో యుద్ధం వస్తే యుద్ధరంగంలో ఈ సముద్రపు ట్యాకర్లు మోగవు అని అర్థం. ఇంతకన్నా దేశద్రోహం ఏమి ఉంటుంది?
గయలో మనోరమాయాదవ్ కుటుంబాన్ని ‘బాహుబలి వర్గం’గా భావిస్తారు. వీళ్లు తుపాకులతో బెదిరించి ఓట్లువేయించుకుంటారు. లల్లూ ప్రసాద్ యాదవ్ అండదండలు వీరికున్నాయి. పోలీసులు వీరిపై కేసులు పెట్టేందుకు భయపడతారు. అలాంటప్పుడు రాకీ యాదవ్ రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా పంతొమ్మిది సంవత్సరాల ఆదిత్య సిన్హాను కాల్చి చంపడంలో ఆశ్చర్యమేముంది? ఈ దుర్మార్గం జరిగినప్పుడు మన పురస్కార తిరస్కార బృందం ఎందుకు మాట్లాడటం లేదు?
ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో రాళ్లతో కొట్టబడ్డ పశువుల దొంగ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి కాత్యాయనీ విద్మహే పురస్కారాలు తిరస్కరించారు. ఆదిత్య సిన్హా ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, కమ్యూనిస్టు కాదు. అందుకని వీరు తమ పురస్కారాలు తిరిగి ఇవ్వలేదు.
ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నాడు. ఆయనతో వడోదరా నుండి మాట్లాడుతున్న వారి ఫోను నెంబర్లు మన వద్ద ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అని పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయిస్తున్నది. వెయ్యికోట్లు భారత బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ చేరిన విజయ్ మాల్యాను ఇండియాకు పంపలేమని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి మన ప్రభుత్వం ఏమి చేస్తున్నది?
మాజీ ఆప్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, రమణ్ సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ 1.5 మిలియన్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నాడని ఆరోపించారు. విచారణ జరిపి నిజమైతే సోనియా, అహ్మద్ పటేల్‌లతో పాటు రమణ్‌సింగ్ కొడుకును కూడా బిహార్ జైలుకు పంపండి. 2016, మే 13న మే సాయంత్రం వివాని రైల్వేస్టేషన్ వద్ద రాజదేవ రంజన్ అనే హిందూస్తాన్ పత్రిక సీనియర్ జర్నలిస్టు కాల్చి చంపబడ్డాడు. ఆర్‌జెడికి చెందిన రౌడీ షాయుద్దీన్ నియోజకవర్గం ఇది. బిహార్‌లోని అటవిక రాజ్యానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంకావాలి?
ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రష్యానుండి వస్తున్న సమయంలో విక్రమాదిత్య ట్యాంకర్‌కు తూట్లు పడ్డాయి. అంటే యుద్ధంలో భారత నౌకా దళాన్ని సోనియా ప్రభుత్వం ముడుపులు ఆశించి పణంగా పెట్టిందని, ఎకె ఆంటోనీని మాస్టర్ క్లీన్ అని నమ్మగలమా? ఇందుకు వారు చెప్పే సమాధానం ‘‘ గ్యారంటీ కార్డు ఉన్నది కదా, అది చూపితే బీటలు వారని ఫిరంగిని మరొకటి ఇస్తారులే’’ అని. నిబంధనలు తిరస్కరించి ఇటు అగస్టా, అటు నేవీ గన్స్‌కు ఇటలీ కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?
దేశ ప్రజల దృష్టికి రాని ఒక కుంభకోణం ఇస్రోలో జరిగింది. మాధవన్ నాయర్ ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నప్పుడు 578 కోట్ల ఒప్పందం అంత్రిక్స్-దేవాష్‌తో జరిగింది. ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని అప్పటి ప్రభుత్వం నాయర్‌ను తప్పించింది. కానీ డబ్బు ఏమైందో జాడ తెలియలేదు. ఈ విషయంలో కుట్రపూరితంగా ఆంత్రిక్స్‌కు లాభం చేకూర్చారని ఆరోపణ. 2000లో భారతదేశంలోని అంతరిక్ష రంగంలో ప్రైవేటు ప్రవేశం అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం ఫలితమిది. 2003లో ఆంత్రిక్స్ అమెరికాలోని ఫోర్డ్ ఎడ్వైజర్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. డిజిటల్ మల్టీ మీడియా సర్వీసెస్ రంగంకోసం జరిగిన ఒప్పందమిది. ఇందులో ఎవరెవరికి ముడుపులు ముట్టాయన్నదానిపై సిబిఐ ఇప్పుడు విచారణ మొదలుపెట్టింది. నాటి ప్రభుత్వ మద్దతు లేకుండా ఇంతటి పెద్ద కాంట్రాక్టుపై మాధవన్ నాయర్ సంతకాలు చేశాడంటే ఎవరూ నమ్మలేరు. ఎన్నికలకు ముందు లెఫ్ట్ సంఘటన అధికారంలోకి వస్తే అచ్యుతానందన్‌ను ముఖ్యమంత్రి అని సిపిఎం ప్రకటించింది. అవసరం తీరాక ఈ వృద్ధ నాయకుడిని చెత్తబుట్టలో పడేసి పిన్నారాయ్ విజయన్ అనే ‘బాహుబలి’ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇది శుభసూచన కాదు. అంటే బిహార్‌లోని జంగిల్ రాజ్ కేరళలోకి ప్రవేశించబోతున్నదని అర్థం.
హేమంత విశ్వాస్ శర్మ, అస్సాంలో మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి కుడిభుజం వంటివాడు.ఆయన న్యూఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ దర్శనం చేసుక్నొడు. అప్పుడు రాహుల్ ఆయనవైపు కనె్నత్తి కూడా చూడలేదు. దీంతో ఆగ్రహించిన హేమంత్ గౌహతికి తిరిగి వచ్చి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తరుణ్ గొగోయ్ ఓటమికి హేమంత విశ్వాస్ ఒక కారణం.

-ముదిగొండ శివప్రసాద్