క్రైమ్/లీగల్

తండ్రీకొడుకులు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 18: తెలుగు సంవత్సరాది రోజున తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం జెఎన్ రోడ్డు ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఇద్దరూ తొలుత పురుగుల మందు సేవించి, ఆతరువాత ఒకే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా చంద్రవరంనకు చెందిన మద్దిపాటి శివరామకృష్ణ(60) తన చిన్నకుమారుడు కుమారుడు నరేష్(35)తో కలిసి పివిసి పైపుల వ్యాపారం నిర్వహిస్తూ, స్థానిక జెఎన్ రోడ్డులోని అద్దేపల్లికాలనీ యశోదా అర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మనస్పర్థల కారణంగా శివరామకృష్ణ భార్య కొద్దికాలం నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఆస్తి కోసం ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. అలాగే కుమారుడు నరేష్ భార్య కూడా వివాదాల కారణంగా కాకినాడలోని పుట్టింట్లో ఉంటోంది. పెద్దకుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, మరో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో గత కొంతకాలం నుంచి శివరామకృష్ణ ఆయన కుమారుడు నరేష్‌లు ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం పొరుగువారు ఉగాది పచ్చడి పంచేందుకు తలుపుకొట్టగా స్పందన లేదు. అలాగే బంధువుల ఫోన్లకు కూడా శివరామకృష్ణ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికంగా ఉన్న ఆయన సోదరుడు స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా తండ్రీ, కొడుకు ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. కింద పురుగుల మందు డబ్బా కనిపించింది. దీంతో వారు తొలుత పురుగుల మందు తాగి, ఆతరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. బంధువుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శివరామకృష్ణ రాసిన 4 పేజీల లేఖ సంఘటనా స్థలంలో లభ్యమైంది. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని తూర్పు మండలం డిఎస్పీ యు నాగరాజు, సిఐ సిహెచ్ భాస్కరరావు సందర్శించారు.