తూర్పుగోదావరి

టిడిపి పాలనపై ప్రజల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, ఏప్రిల్ 24: ప్రస్తుత టిడిపి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు నార్ని వీరవెంకట సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గపార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రుద్రరాజు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని, సమయం వచ్చినప్పుడు టిడిపికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ వైసిపి కూడా ఘోరంగా విఫలమైందని, అది అధికారం కోసం పుట్టింది కాబట్టి ప్రజల సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తోందని రుద్రరాజు ఆరోపించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ మాట్లాడుతూ టిడిపి అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. దేశానికి నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. త్వరలో గ్రామ కమిటీల ఎంపిక పూర్తిచేసి గడపగడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రజల వద్దకు వెళతామని గౌతమ్ తెలిపారు. సమావేశంలో పిసిసి కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అంకం వీర్రాజు, పిసిసి బిసి విభాగం కన్వీనర్ మావరపు శివన్నారాయణ, అంబాజీపేట మండల అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు పోతు కాశి, కోట వీరవెంకట సత్యనారాయణ, పెమ్మాడి మారుతీ కృష్ణమోహన్, యల్లమెల్లి నాగేశ్వరరావు, చిట్టాల జోగేశ్వరరావు, చిలకపాటి శ్రీ్ధర్, పెందుర్తి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.