తూర్పుగోదావరి
మన్యంలో పోలీసులు అప్రమత్తం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 February 2019
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు హతం కావడంతో జిల్లా పోలీసు అధికారులు మన్యం పోలీసులను అప్రమత్తం చేశారు. జడ్డంగి ఎస్సై టి.జి. నరేంద్రప్రసాద్ సారధ్యంలో పోలీసులు రాజవొమ్మంగి నుండి జడ్డంగి వరకు సుమారు 10 కి.మీ దూరంలో ఆర్ అండ్ బి రహదారి కింద ఉన్న కల్వర్టులను, వంతెనలను తనిఖీ చేశారు. మావోయిస్టులు మందుపాతరలు ఏర్పాటుచేసి విధ్వంసాలు తలపెట్టే అవకాశమున్నందున మందు జాగ్రత్తగా రోడ్ ఓపెనింగ్ పార్టీ సహాయంతో తనిఖీలు చేపట్టారు. రాజవొమ్మంగి నుండి ఏలేశ్వరం వెళ్లే రహదారిపై విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు.