తూర్పుగోదావరి

సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, మే 6: రైతులు సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలని విశాఖపట్టణం ట్రాన్స్‌కో సిజిఎం మూర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని కడియపులంకలో సోలార్ యూనిట్లను ఆయన పరిశీలించారు. సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు తలెత్తితే టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో తీసుకువచ్చామని, ఆ ఫ్రీ కాల్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల సిస్టమ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని, సోలార్ విద్యుత్ వినియోగం పెరిగితే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేసే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎడిఇలు, ఎఇలు, నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు పాల్గొన్నారు.