తూర్పుగోదావరి
ఆరుకు చేరిన ప.గో. రోడ్డు ప్రమాద మృతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 August 2016
అయినవిల్లి, ఆగస్టు 23: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బంగారమ్మపేట వద్ద జరిగిన ప్రమాదంలో అయినవిల్లి మండలం నేదునూరు గ్రామానికి చెందిన అంబేద్కర్ ఇద్దరు కుమారులు మృతిచెందగా కాకినాడ జిజిహెచ్లో చికిత్స పొందుతున్న అతని భార్య పులిదిండి వీరవేణి (23) మంగళవారం మృతి చెందింది. దీంతో అంబేద్కర్ కన్నీరుమున్నీరయ్యాడు. మంగళవారం నేదునూరుకు తీసుకొచ్చిన వీరవేణి మృతదేహం వద్ద అంబేద్కర్ విలపిస్తున్న తీరు అందర్నీ కంట తడిపెట్టించింది. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.