తెలంగాణ

సరదా కోసం షాపులకు నిప్పుపెట్టిన యువకులు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికిందరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆల్ఫా హోటల్ వద్ద మూడు షాపులు దగ్ధం కావడం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సిసి టీవీ ఫుటేజి ఆధారంగా ఇద్దరు యువకులు షాపులకు నిప్పు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కేవలం సరదా కోసం వీరు షాపులను దగ్ధం చేశారని విచారణలో తేలింది. నిందితులను 8వ బెటాలియన్ ఎసిపి హనుమంతరావు కుమారుడు చిరంజీవి, వైద్య విజ్ఞాన పరిషత్‌లో ఇంజనీర్ కృష్ణంరాజు కుమారుడు జయేంద్ర వర్మలుగా పోలీసులు కనుగొన్నారు. ఈ ఇద్దరినీ అరెస్టు చేసి పూర్తి వివరాలు రాబడుతున్నారు.