జాతీయ వార్తలు
ఉత్తరాదిలో ఈవీఎంల తరలింపు కలకలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 May 2019
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్, బిహార్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వర్గాలు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ).. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘాజీపూర్ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ అనే అభ్యర్థి స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్రూమ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.