భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి కుతంత్రం
మణికంఠుని మీద రాజదంపతుల వాత్సల్యానురాగాలు, ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి! హు! తన ఆలోచనలన్నీ తలక్రిందులైనాయి. ఎవరికో జన్మించి మహారాజు కళ్లబడి దత్తపుత్రుడుగా ఈ మణికంఠుడు వచ్చి తన మార్గానికి అడ్డుగా నిలబడిపోయాడు! ఈ అడ్డును తొలగించుకుని రాజ్యాన్ని తన వశం కావించుకోవాలి! ఏం చేస్తే తన మార్గం నుండి ఆ మణికంఠుడు తొలగిపోతాడు?’’
తన ఇంట్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి వీరబాహు! పైకి విశ్వాసపాత్రుడుగా నటిస్తూనే రాజ్యాన్ని ఏ విధంగా తన హస్తగతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ వుంటాడు మనస్సులో! రాజదంపతులకు సంతాన భాగ్యం లేదనీ, రాజ్యం ఆయన తదనంతరం తన వశం చేసుకోవాలనే దురాలోచనలో వున్న మంత్రికి మణికంఠుని రాక ఎంత మాత్రం నచ్చలేదు! అందుకే అతడిని ఎట్లాగైనా తన మార్గం నుండి శాశ్వతంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు!
‘‘మహామంత్రీ! ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో వున్నట్లున్నారు?’’ అంటూ సేనాపతి వచ్చి పలకరించాడు!
సేనాపతి కూడా మంత్రిలాగానే మణికంఠునిపై ప్రజల ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్యాసూయలతో దహించుకుపోతున్నాడు!
ఇద్దరూ కలిసి ఎట్లాగైనా మణికంఠుని త్వరలో అంతం చేయాలని ఆ రోజు చాలాసేపు చర్చించుకున్నారు!
‘‘మహామంత్రి! నాకొక ఉపాయం తోస్తున్నది! మనమీద ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా చేస్తే.. ’’ అంటూ తనకు తోచిన పథకం చెప్పాడు సేనాపతి.
అతను చెప్పింది విన్న మంత్రి ముఖం ఆనందంతో వికసించింది!
‘‘నేనూ సరిగ్గా అట్లాగే అనుకున్నాను! స్వయంగా విచారించి తెలుసుకున్నాను. అటువంటి వాటిలో బాగా నిపుణుడని! ఇంకా ఆలస్యం ఎందుకు? పదా! వెళ్లి కలుసుకుని విషయం చెప్పివద్దాం!’’ అంటూ లేచాడు ఉత్సాహంగా!
ఇద్దరూ వేషాలు మార్చుకుని రహస్య మార్గాన బయటకు వెళ్ళారు!
***
మణికంఠుని అస్వస్థత
‘‘ప్రభూ! ప్రభూ! రాకుమారుడు అస్వస్థులైనారు! విపరీతమైన బాధతో శయ్యపైనుండి లేవలేకపోతున్నారు ప్రభూ!’’ అంటూ పరిచారికలు పరుగు పరుగున వచ్చి చెప్పడంతో ఆందోళనగా మణికంఠుని శయనాగారంలోకి వెళ్ళారు రాజదంపతులు!
‘‘బాధ! బాధ!’’ అంటూ సతమతవౌతున్నాడు మణికంఠుడు! శరీరం శక్తి హీనమై కదలలేకపోతున్నాడు! బంగారు మేనిఛాయ నలుపు రంగులోకి మారింది! చర్మమంతా ముడుతలు పడి వ్రణాలతో రసి కారుతున్నది!
‘‘అయ్యో! ఏమిటీ విపరీత పరిస్థితి? రాత్రివరకు ఆరోగ్యంగా వుండిన నీకు హఠాత్తుగా ఇటువంటి రోగం ఏ విధంగా సంభవించింది? పుత్రా! మణికంఠా! ఇతరుల బాధలు తీర్చే నీవు ఈ విధంగా బాధపడటం చూడలేకుండా వున్నాము! మమ్మల్ని పరీక్షించకు! త్వరగా స్వస్థుడవు అవాలి! మా మాట వినిపించుకో కుమారా!’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది రాణి మణికంఠుని తలను ఒడిలో పెట్టుకుని!
రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు!

-ఇంకాఉంది

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం