రాష్ట్రీయం

నిపుణుల కమిటీని వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల ఆత్మహత్యల నివారణకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రైతుల ఆత్మహత్యల నివారణపై తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రైతు జెఏసి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తూ రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి పరిష్కార మార్గాలను అనే్వషించాలని, పూర్తి నివేదికతో హాజరు కావాలని స్పష్టం చేసింది. ఆత్మహత్యలకు మూలకారణం ఏమిటో సమగ్రంగా విశే్లషించాలని తెలిపింది. కేవలం రుణమాఫీతోనే ఆత్మహత్యలు ఆగవని, అసలు కారణాలను అనే్వషించి వాటి పరిష్కారమార్గాలు తెలుసుకోవాలని కోరింది. హైకోర్టు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేయాలన్న పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు రైతు సమస్యలపై ఇరు రాష్ట్రాలు నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశించింది. జనవరి నాలుగో తేదీలోగా పూర్తి స్థాయి నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు.