జాతీయ వార్తలు

ఆయుధాగారంలో మృతుల సంఖ్య 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రోని వార్ధా జిల్లా పుల్గావ్ వద్ద ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. సోమవారం రాత్రి మంటలు వ్యాపించడతో 16 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం సంఘటన ప్రాంతంలో మరో రెండు మృతదేహాలు లభించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు 16 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో చుట్టుపక్కల ఇళ్లనుంచి వెళ్లిపోయినవారు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.