తెలంగాణ

ఇంటికి నిప్పుపెట్టిన ఆగంతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: ఓ కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున ఇంటిపై కిరోసిన్ పోసి కొందరు దుండగులు నిప్పంటించారు. జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో ఈ ఘటన జరిగింది. మంటలు వ్యాపించడంతో అతి కష్టమీద తలుపులు తీసుకుని కుటుంబ సభ్యులు బయటపడ్డారు. ఇంటి యజమాని సుంకయ్య, అతని భార్య సునీత, పిల్లలు వీరేష్, క్రిష్, దాన్యాలు గాయపడ్డారు. వీరిని సికిందరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎవరూ సహాయం చేయకుండా దుండగులు మిగతా ఇళ్లకు బయట గడియలు పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.