ఆంధ్రప్రదేశ్‌

లోయలోకి దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుగురు దుర్మరణం
కడప, మార్చి 14: కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద సోమవారం ఉదయం లారీ లోయలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఐదుగురు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కడప జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మల్లికార్జున అతడి కుమార్తెకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 50 మందికి పైగా బంధువులు, సన్నిహితులతో కలిసి ఏపి 04 సి 2765 లారీలో సోమవారం ఉదయం నల్లగుట్టపల్లె నుంచి పెండ్లిమర్రి మండలం పొలతల శ్రీమల్లికార్జునస్వామి క్షేత్రానికి బయల్దేరారు. ఉదయం 7-8 గంటల మధ్య మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్ దిగుతుండగా, ఆంజనేయస్వామి గుడి మలుపు వద్ద లారీ అదుపుతప్పి 60 అడుగుల లోతు ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కుంటా మల్లమ్మ (60), జి.మధుసూదన్‌నాయుడు (38), చిన్నయ్య (45), చిన్నగంగయ్య (60), కె.నారాయణ (60) మృతి చెందారు.