ఫ్లాష్ బ్యాక్ @ 50

‘కలిసొచ్చిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ లక్ష్మీ టాకీస్ థియేటర్ యజమాని, నటులు ఎన్.టి.రామారావు మిత్రులు మిద్దే జగన్నాథరావు తొలుత జలరుహ ప్రొడక్షన్స్‌పై ‘రాజనందిని’ నిర్మించారు. ఆ తరువాత ఎస్.వి.ఎస్. ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్.టి.రామారావు, కాంచన కాంబినేషన్‌లో వీరు రూపొందించిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. 10-08-1968 విడుదల.
19-02-1930లో విజయవాడలో జన్మించారు. శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ బిఎస్సీ చదివాక, వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో ఇంజనీరుగా ప్రసిద్ధిచెందారు. ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బరావుగారి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకత్వం నెరిపారు. అన్నపూర్ణావారి ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రస్థానం ప్రారంభించారు. వీరి దర్శకత్వంలో తీర్చిదిద్దిన చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. ఈ చిత్రానికి కథ- పినిశెట్టి, కళ-తోట, స్టంట్స్- సాంబశివరావు, ఛాయాగ్రహణం- కె.ఎస్.రామకృష్ణ, నృత్యం- చిన్ని- సంపత్, సంగీతం- టి.వి.రాజు, కూర్పు- బి.గోపాలరావు, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- కె.విశ్వనాథ్, నిర్మాత- మిద్దే జగన్నాథరావు.
జమిందారు రావుబహద్దుర్ రాఘవేంద్రరావు, గర్భవతియైన భార్య శారదతో కలిసి ప్రయాణిస్తూ, ఆమెకు నొప్పులు రావటంచేత, దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేరుస్తాడు. ఆ ప్రసవంలో భార్యా, బిడ్డ మరణిస్తారు. అదే ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన పార్వతి (శాంతకుమారి) పేదరాలు. బహు సంతానం, అసమర్ధుడైన సోమరి భర్తతో ఇబ్బందులు పడుతుంటుంది. ఆమెకు మగపిల్లవాడు జన్మిస్తాడు. జమిందారు, ఆమెను వేడుకొని, ఆ బిడ్డని తనతో తెచ్చి పెంచి పెద్దచేసి ప్రయోజకుడిని చేస్తాడు. అతడు ప్రకాష్ (ఎన్.టి.రామారావు) ప్రక్కన పల్లెటూరిలో వడ్డీ వ్యాపారి, లోభి పానకాలు (్ధళిపాళ) పేద రైతులను పీడించుకు తింటుంటాడు. అతని కూతురు శోభాదేవి (కాంచన), కొడుకు గణపతి (రాజ్‌బాబు), శోభాదేవి, ప్రకాష్ ప్రేమించుకుంటారు. ఆ వూరిలోనే భర్తను పోగొట్టుకున్న పార్వతమ్మ ఓ కొడుకు రంగడు (సత్యనారాయణ) అప్రయోజకుడు సోమరి, దొంగబుద్ధి కలవాడు. కూతురు గౌరి (సంధ్యారాణి) తల్లితోపాటు కష్టపడుతుంది. వారి మేనమామ కోటయ్య (మిక్కిలినేని) కూతురు లక్ష్మి(సుకన్య)ని రంగడికిచ్చి పెళ్ళిచేసి, రోజూ విచారిస్తుంటాడు. ఆ పల్లెటూరు వచ్చిన ప్రకాష్‌ను పార్వతమ్మ గుర్తించి, జమిందారును కలిసి నిర్ధారించుకుంటుంది. జబ్బుచేసి జమిందారు మరణించగా నౌకరు రామయ్య (మల్లాది)వల్ల పార్వతమ్మ, తన తల్లి అని ప్రకాష్ తెలుసుకుంటాడు. తల్లిని ఒప్పించి, వారందరిని తనతో పట్నం తీసుకువస్తాడు. డబ్బు చేతికివచ్చిన రంగడు, మేనేజర్ భూపతి(ప్రభాకర్‌రెడ్డి) స్నేహంతో మరింత వ్యసనపరుడుగా మారతాడు. భార్యను ఏలుకోవటంకోసం రంగడికి ఆస్తి రాసిచ్చిన ప్రకాష్‌ను కాదని, తన కూతురు శోభను రంగడికి రెండో పెళ్ళికి పానకాలు సిద్ధపడడం, తల్లిని, చెల్లిని, లక్ష్మిని హింసిస్తున్న రండికి బుద్ధిచెప్పటానికి ప్రకాష్ సర్ధార్జీగా మారువేషంలో వచ్చి, శోభతో రంగడి పెళ్ళి చెడగొట్టి, పరిస్థితులు చక్కపెట్టడం, ప్రకాష్, శోభల, గౌరి, గణపతిల వివాహం చెడగొట్టాలని, భుజంగంతో కలిసి వెళ్ళిన రంగడు, ప్రకాష్‌ను తుపాకీతో కాల్చటం, అది చూసిన పార్వతమ్మ రంగడిని తుపాకిలో చంపపోవటం, ప్రకాష్, లక్ష్మి వచ్చి వారించటం, ఈ సంఘటన రంగడిలో పరివర్తన కలిగించి, అందర్నీ క్షమించమని కోరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో శఠగోపంగా అల్లు రామలింగయ్య, డాన్సర్‌గా విజయలలిత, దర్శకులు విశ్వనాథ్ సెంటిమెంటుతో కూడిన సన్నివేశాలను, జమిందారు బాబును తీసుకువచ్చేటప్పుడు, పార్వతమ్మ ఇచ్చిన ఆంజనేయుని బొమ్మను (ఏ పుట్టుమచ్చలు కాకుండా) ఇన్ని సం. ప్రకాష్ మెడలో వుంచడం, వారి ఔన్నత్యానికి నిదర్శనంగా, దానివల్ల పార్వతమ్మ కొడుకు గుర్తించి, జమిందారును కలిసి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటం, తన తల్లి పార్వతమ్మ అని తెలిసిన ప్రకాష్, ఆమెను ఒప్పించటానికి ఓ గీతంద్వారా ప్రయాస పడడం, ‘అమ్మా నీవు నా అమ్మవుకావా అమ్మా’ (రచన- సి.నా.రె, గానం- ఘంటసాల) ఈ పాటను రాత్రిపూట, బ్లాక్‌షేడ్స్ చిత్రాల ద్వారా గుడిసెలో ఎఫెక్టివ్‌గా చిత్రీకరించటం, దానికి శాంతకుమారి రియాక్షన్ (అప్పట్లో ఈ పాట సాహిత్యం గురించి పలు విమర్శలు వచ్చాయి) ఎన్.టి.ఆర్. వ్యధ ఎంతో చక్కగా తీశారు. ఏ రక్తసంబంధీకుల లేక ఒంటరిగా పెరిగిన ప్రకాష్ అయినవారు అన్న, చెల్లి, తల్లి లభించగానే, తల్లి హెచ్చరిస్తున్న వినక అన్నగారికి తన ఆస్తికట్టబెట్టడం. ఆరోజుల్లో దేశంలో ముఖ్య సమస్యఅయిన భాషా సమస్యగూర్చి తమాషాగా చిత్రీకరించిన ప్రబోధగీతం ‘వందనాలు గైకొనుడయ్యా’(మాధవపెద్ది, ఘంటసాల, పి.సుశీల బృందం- రచన సి.నా.రె). అలాగే షావుకారు జులుం ఎదిరించి, రైతులు ప్రభుత్వ పథకాలు అనుసరించాలని, సమిష్టి వ్యవసాయం గూర్చిన గీతాన్ని ఎంతో వివరంగా ఆకట్టుకునేలా చిత్రీకరణ ‘పట్టండి నాగలి పట్టండి, కట్టండి’(రచన- సి.నా.రె, ఘంటసాల, యల్.ఆర్.ఈశ్వరి బృందం) చిత్రం చివరలో ఎన్ని నీతులుచెప్పినా వినని రంగడిలో, ప్రకాష్‌కు తుపాకీదెబ్బ తగలగానే కొంత, తల్లి అతన్ని తుపాకీతో కాల్చబోవటం, భార్య లక్ష్మి అందుకు అడ్డుపడడంతో, మార్పు పూర్తిగా రావటం, ఎటువంటి తప్పుడుభావాలు, దురలవాట్లుగల వ్యక్తులనయినా, ఏదో సంఘటన మార్పు తేగలదనే నమ్మకం చూపేలా చిత్రీకరించటం, విశ్వనాథవారి ప్రత్యేకతగా భావించాలి. ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌గా ఎన్.టి.రామారావు, పార్వతమ్మగా శాంతకుమారి నటన మెచ్చుగోదగ్గ స్థాయిలో ప్రదర్శించారు కాంచన, ఎన్.టి.ఆర్‌తో జోడిగా ముచ్చటగొలిపే నటన చూపటం, రాజ్‌బాబు, డొనేషన్లుకట్టి వైద్యం రాని డాక్టరుగా హాస్యం ఒలికించటం, అతని జోడిగా సంధ్యారాణి తనతో సమానంగా మెప్పించింది. వీరిద్దరిపై ఓ యుగళగీతం హుషారుగా సాగింది. ‘తాపం, తాపం అయ్యో ఏంతాపం’- పిఠాపురం, జమునారాణి- రచన సినారె). ఎన్.టి.ఆర్, కాంచనలపై పచ్చని పంటపొలాలలో హాయిగా చిత్రీకరించబడిన గీతం ‘పచ్చ, పచ్చని చిలుకా’(ఘంటసాల, పి.సుశీల బృందం- సినారె). మరో సినారే గీతాలు రెండు, హిందీ పదాలతో తమాషాగా ఎన్.టి.ఆర్, కాంచనలపై (ఈ ప్రేమపాఠం నీ ప్రేమకోసం ప్రియా) ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి) మారువేషంలో ఎన్.టి.ఆర్. కాంచనతో ‘అంతకోపమా వద్దువద్దు, ఓ నజరానా జర ఇధరానా’ (హిందీ పదాలు) (ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి) అలరించేలా చిత్రీకరించటం, ఈ చిత్రం పేరుచెప్పగానే గుర్తుకువచ్చే గీతాలుగా ‘పచ్చ పచ్చని చిలుకా’, ‘పట్టండి, అమ్మా నీవు నా అమ్మవు నిలవటం విశేషం. విజయలలితపై చిత్రీకరించిన కవ్వించే గీతం ‘నిన్ను చూడందే నా వలపు ఆరదు’. సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డిలపై చిత్రీకరణ. (ఎల్.ఆర్.ఈశ్వరి- రచన కొసరాజు) సి.నా.రె, కొసరాజుల సాహిత్యానికి టి.వి.రాజు అందించిన సంగీతంతో పాటలు అలరించేలా సాగాయి. ఆర్థికంగా సక్సెస్ అంతగా సాధించకపోయిన ‘కలిసొచ్చిన అదృష్టం’చిత్రం. అన్ని హంగులతో, పాటలతో చక్కని కాలక్షేప చిత్రంగా నిలవటం విశేషం.

- సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి