అంతర్జాతీయం
న్యూజిలాండ్లో కాల్పులు :40 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూజిలాండ్:రెండు ప్రార్థనామందిరాలను లక్ష్యంగా చేసుకుని న్యూజిలాండ్లో జరిగిన కాల్పుల్లో మొత్తం 40 మంది మృతిచెందారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ ప్రకటించారు. లిన్వుడ్ వద్ద పది మంది, డీన్ ఏవ్ మసీదు వద్ద మరో 30 మంది మృతిచెందారు. ఈ కాల్పుల ఘటనలో మరో 27 మంది గాయపడ్డారు. ఇదో అసాధారణ కాల్పుల ఘటన అని ప్రధాని జెసిండా అన్నారు. ఇది ఉగ్రవాద చర్యే అని ఆమె తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక మహిళతో సహా నలుగుర్ని అదుపులోనికి తీసుకున్నారు. అల్నూర్ మసీదు వద్ద ఓ వ్యక్తి ఆటోమేటిక్ ఆయుధంతో ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో మసీదులో 300 మంది వరకు వున్నారు. క్రైస్ట్చర్చ్కు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు ప్రధాని జెసిండా చెప్పారు.