జాతీయ వార్తలు
రిపబ్లిక్ డే అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 November 2015
న్యూఢిల్లీ, నవంబర్ 21: వచ్చే ఏడాది భారత గణతంత్ర దినోత్సవాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయమై ఇటు భారత్ గానీ అటు ఫ్రాన్స్ గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో పంపిన ఆహ్వానానికి హోలాండ్ అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు హోలాండే శనివారం న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ ద్వారా తెలియజేశారు.