గుంటూరు

కాజ వద్ద రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 6: 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళగిరి మండలం కాజ టోల్‌గేట్ సమీపాన శుక్రవారం తెల్లవారుఝామున 1.30 గంటల ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మంత్రి రవీంద్రకు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతి నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి రవీంద్ర, ఆయనతో పాటు గాయపడిన క్షతగాత్రులను తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అందరికీ స్వల్ప గాయాలే కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు.