క్రైమ్/లీగల్

తల్లీ బిడ్డల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, ఏప్రిల్ 17: భర్త వేధింపులు తాళలేక తల్లీ, బిడ్డలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని రెంటాల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రెంటాల గ్రామానికి చెందిన సోము ఆంజనేయులు కుమార్తె కృష్ణవేణిని బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన బత్తుల రఘుకు 2009లో వివాహం చేశారు. వీరికి ఆరున్నర సంవత్సరాల కమలపిల్లలైన జేమ్స్, నాగజ్యోతి సంతానం. రఘు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళి సమయంలో కట్నం కింద ఎకరం పొలం ఇచ్చారు. రఘు దుర్వ్యసనాలకు బానిసై పొలాన్ని విక్రయించి, డబ్బులు తెస్తావా లేదా అంటూ వేధింపులు ప్రారంభించాడు. ఈ వేధింపులు తాళలేక తన స్వగ్రామమైన రెంటాలకు చేరుకుంది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. కుటుంబంలో ఏమైందో ఏమోగాని, తల్లిదండ్రులు బయటకు వెళ్ళగానే ముందుగా పిల్లలకు ఉరి వేసి, ఆమె ఉరి బిగించుకుంది. పిల్లలు పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని కాపాడారు. ఆ వెంటనే పిడుగురాళ్ళలోని వైద్యశాలకు తరలించారు. విషాహారం తిన్నారేమోనని అనుమానంతో డాక్టర్లు కక్కించే ప్రయత్నమూ చేశారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వీరు ప్రమాదం నుండి బయటపడ్డారు.