గుంటూరు

వాజ్‌పేయికి బీజేపీ నేతల శ్రద్ధాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఆగస్టు 17: పొన్నూరులోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, పార్టీ నాయకులు దాసరి రమేష్, తోట జనార్ధనరావు, ఆరే వెంకటరావు, మైనార్టీ సెల్ నేత బుడే, గుప్తా, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రూ 6 లక్షలతో ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ ఏకగ్రీవ ఆమోదం
తెనాలి, ఆగస్టు 17: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరు లక్షల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించేందుకు కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్బయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఎం, హెచ్‌డీఎస్ నిధుల నుండి హెచ్ 1, ఎన్ 1, స్వైన్‌ప్లూ పరిక్ష యంత్రాన్ని కొనుగోలు చేయడాన్ని ఆమోదించారు. మూడు హెచ్‌పీ సెప్టిక్ ట్యాంకు మోటారు కోసం 25 వేల రూపాయలు, నూతనంగా తల్లీ పిల్లల వైద్యశాల విభాగాన్ని ఏర్పాటు చేయటంతో పాత వార్డుల్లో ఎన్‌క్లూఎస్‌టీం ఇచ్చిన సలహా మేరకు పిల్లలు ఆడుకునేందుకు అటబొమ్మల కొనుగోలుకు కమిటీ ఆమోదం తెలిపింది. శవాగారంలో స్టెరిలైజింగ్ చేసేందుకు అనుమతి తదితర పలు సమస్యల పరిష్కారానికి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్మన్ డాక్టర్ కబ్బయ్య తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతరావు, ఏఓ డాక్టర్ రవి, కొత్తా సుబ్రమణ్యం, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.