గుంటూరు

రైతు సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 7: మండల పరిధిలోని పెదవడ్లపూడిలో గురువారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్‌చైర్మన్ మనె్నం రమేష్ పొలం దున్ని పసుపు విత్తనాలను విత్తారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రైతుసంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని, కృష్ణా, గోదావరీ నదుల అనుసంధానం చారిత్రక విషయమన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు రైతుపక్షపాతి అని కొనియాడారు. మండల టిడిపి అధ్యక్షుడు చావలి ఉల్లయ్య, టిడిపి చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అనే్న చంద్రశేఖర్, జవ్వాది కిరణ్‌చంద్, ఆంజనేయులు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.