క్రైమ్/లీగల్

నిమజ్జనంలో యువకుని గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శావల్యాపురం, సెప్టెంబర్ 18: మండలంలోని గంటావారిపాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచి కెనాల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుం ది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం ప్రకాశం జిల్లా సంతమాగులూరు కు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం నిమిత్తమై మంగళవారం ఉద యం అద్దంకి బ్రాంచి కెనాల్ వద్దకు వచ్చి గణేష్ నిమజ్జనం చేసే ప్రయత్నం లో అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వరరావు (47) కాలువలో పడి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మృతదేహం కోసం తహశీల్దార్ కోటేశ్వరరావునాయక్, ఎస్‌ఐ మన్మధరావు, బంధువులు, వివిధ గ్రామాల ప్రజలు కాలువ వెంట గాలిస్తున్నారు.

విద్యుదాఘాతంతో దంపతులు దుర్మరణం
దుర్గి, సెప్టెంబర్ 18: మండలంలోని అడిగొప్పల గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందారు. కుమారుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ధూళిపాల గోవర్ధనరావు (50), వెంకట్రావమ్మ (45)ల కుమారుడు రవితేజ గృహంలోని బాత్ రూమ్‌లోకి వెళ్లి దండానికి కరెంట్ రావడంతో కేక వేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికి వెళ్లి దండెం తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. దుర్గి ఎస్‌ఐ సుబ్బనాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.