ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలోనూ పర్యటిస్తున్నా: గవర్నర్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తాను తెలంగాణకే గవర్నర్‌లా వ్యవహరిస్తున్నాననడం సరికాదని, ఎపిలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నానని తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన గురువారం ఉదయం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో కాసేపు మాట్లాడారు. ఎపి, తెలంగాణల మధ్య వివాదాల పరిష్కారానికి ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిగాయని, త్వరలో ఇద్దరు సిఎంలతో కలిసి చర్చిస్తానని ఆయన తెలిపారు. పలు విషయాలపై ఎపి సిఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం బాగుందని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం అభివృద్ధికి ఉద్యోగులు, ప్రజలు సహకరించాలన్నారు. వెలగపూడిలో వసతులు, వాతావరణం తనకు బాగా నచ్చాయన్నారు. అమరావతిలో తనకూ స్థలం కావాలన్నారు. రాబోయే పదేళ్లలో రెండు రాష్ట్రాలూ మంచి అభివృద్ధిని సాధిస్తాయని, అప్పటికి తానుండక పోయినా ప్రజలు మాత్రం ప్రగతి ఫలాలను చూస్తారన్నారు.