తెలంగాణ
గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్న గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 December 2019
హైదరాబాద్:గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె కాటారం మండలం బోడగూడెంలో పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ షాపును ప్రారంభించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా గవర్నర్కు గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వారి గ్రామ దేవతను దర్శించుకున్నారు. వారిని రాజ్భవన్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.