ఆంధ్రప్రదేశ్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామం అనంతరం గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు గవర్నర్ నరసింహన్ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ దంపతులకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్ట్రాంతో సత్కరించారు.అనంతరం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించారు. పద్మావతి విచారణ కార్యాలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు నడిచి వెళ్లి పర్వదిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో అరా తీశారు.