రాష్ట్రీయం
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.ఈరోజు ఉదయం తొలుత వరాహస్వామిని దర్శించుకున్న తమిళి సై అనంతరం వీఐపీల సేవా సమయంలో స్వామిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డిలు గవర్నర్కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.