ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వకున్నా, దండిగా నిధులిస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా, భారీగా నిధులను విడుదల చేస్తున్నామని రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ బుధవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఎపికి అదనంగా 22,112 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించిందని, ఇప్పటికే 7వేల కోట్లు విడుదల చేశామన్నారు. ఎపిలో చేపట్టిన పథకాలపై ప్రతి నెలా కేంద్ర మంత్రులు సమీక్షలు జరుపుతున్నారని, కేంద్రం ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ఆయన సవాల్ చేశారు. ఎపిలో బిజెపి, టిడిపి నేతలు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు.