జాతీయ వార్తలు

హోటల్ భవనం కూలి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలన్: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుమార్‌హట్టి ప్రాంతంలో నేలకుంగి ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతులలో ఆరుగురు జవాన్లు కాగా ఓక సాధారణ పౌరుడు ఉన్నాడు. కాగా మరో ఏడుగురు సైనికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు జవాన్లను, 12 మంది పౌరులను సహాయక సిబ్బంది రక్షించారు. హోటల్ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ భవనం కుప్పకూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. పోలీసులు హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.